Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home International పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు..

పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు..

by Rama
Pakisthan Elections

పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న సాయంత్రం ఎన్నికలు ముగిసిన కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ -ECP కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం తమ పార్టీ ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ -PTI గెలుపొందిందని ప్రకటించుకున్నారు. తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్‌ ఇక్బాల్‌ వెల్లడించారు. తమ గెలుపును ఆపేందుకు ఈసీపీ కుట్ర పన్నుతోందంటూ పీటీఐ చేసిన ఆరోపణలను జాఫర్‌ ఇక్బాల్‌ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలిపారు. Read More..

Advertisements

You may also like

Our Visitor

039447
Total views : 196874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: