Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home International ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిలో భారతీయుడు మృతి..!

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడిలో భారతీయుడు మృతి..!

by Satya
Indian was killed in a missile attack on Israel

ఇజ్రాయెల్(Israel):

ఇజ్రాయెల్(Israel) పై లెబనాన్ టెర్రర్ గ్రూపు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి సహా గాయపడ్డ ఇద్దరూ కేరళవాసులని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నార్తరన్ ఇజ్రాయెల్(Israel) లోని మార్గలియత్ పై నిన్న క్షిపణి దాడి జరిగింది. లెబనాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిసైల్ వ్యవసాయ క్షేత్రంలో పడడంతో భారీ పేలుడు సంభవించింది.

ఇది చదవండి: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం..!

ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ఈ దాడిలో కేరళ(Kerala)లోని కొల్లాంకు చెందిన మాక్స్ వెల్ చనిపోయాడు. ఇడుక్కి జిల్లా వాసి పాల్ మెల్విన్ తో పాటు బుష్ జోసెఫ్ లకు చికిత్స అందిస్తున్నామని బెయిలిన్సన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. …
అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.
తమ దేశంలోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్‌ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

039466
Total views : 196955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: