Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana కరీంనగర్‌ కదనభేరిలో కేసీఆర్‌ భావోద్వేగం…

కరీంనగర్‌ కదనభేరిలో కేసీఆర్‌ భావోద్వేగం…

by Prakash
కేసీఆర్‌

రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దుఃఖం వస్తుంది.. కరీంనగర్‌ కదనభేరిలో కేసీఆర్‌ భావోద్వేగం

రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా? ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చటి పొలాలు ఉండే.. 24 గంటల కరెంటు ఉండే.. ఇంతమాయిల్లమే అవన్నీ ఎందుకు మాయమైనయని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్‌ అంటే.. ఆయన నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టి బాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? అంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కరీంనగర్‌ కదన భేరిలో బీఆర్‌ఎస్‌ అధినేత పాల్గొన్నారు. ‘తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో, భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో.. ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ.. దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించాం. ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు’ ఉండేవని గుర్తు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

రైతులు నిలబడగలుగుతం అనుకున్నరు… కానీ 3 నెలల్లోనే పంటలు ఎండబెట్టే పరిస్థితి : కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం. రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇగ నిలబడగలుగుతం అనుకున్నరు. కానీ, మూడునెలల్లోనే ఇంత మార్పు జరిగితే.. పంటలు ఎండబెట్టే పరిస్థితి. నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్‌. ఏం అన్యాయం.. ఏం గరి’ అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ కదనభేరి సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పాలనను తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ నాడు సమైక్య పాలకులను తిట్టినం. ఇప్పుడు అంతకన్నా భయంకరంగా తయారైంది. నేను చేనేత కార్మికులకు మనవి చేస్తున్నా. మీరు మళ్లీ బతకాలంటే మీ తరఫున కొట్లాడే వాళ్లు.. అసెంబ్లీలో ఉన్నరు. పార్లమెంట్‌లో ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని.. అటు కేంద్రాన్ని నిలదీస్తాం. చేనేత కార్మికులు ఆలోచన చేయాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు

మొన్న తమాషకు ఓటేశారు..

‘ఓటు తమాషాకు వేయొద్దు. మొన్న తమాషాకు వేశారు. కరెంటు బాగైంది.. మంచినీళ్లు బాగైనయ్‌.. రైతుబంధు వస్తుంది.. అన్ని సెటిల్‌ అయ్యాయి.. బాధ లేదు.. వీడు ఎక్కువ ఇస్తమని దురాశకు అటు చేయి చూపారు. తీర్థం పోదం తిమ్మక్కంటే.. వాడు గుళ్లే.. మనం చలిలే. నమ్మి తీర్థం పోయినం.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నం ఏమైంది ? వాళ్లు మంచిగ పదవులకెక్కారు.. బ్రహ్మాండంగా ఉన్నరు. డబ్బు మూటలు గుంజుతున్నరు. దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నరు. ఢిల్లీకి మళ్లీ సూట్‌కేసులు పంపుతున్నరు.. ఆ పని మీద ఫుల్‌ బిజీగా ఉన్నరు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌.. ఢిల్లీ.. ఢిల్లీ, హైదరాబాద్‌ తిరుగుడు. మూడునెలల్లో తొమ్మిదిసార్లు పోతరా? ఇన్ని యాత్రలా? ఏం జరుగుతుంది ? మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దలదగ్గర.. పాదాల దగ్గర తాకట్టుపెట్టి.. మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరు. ఇది ఈ విధంగానే కొనసాగాలా? లేక ప్రజల పక్షాన బలం గళం వినిపించి పోరాడే నాయకులు పార్లమెంట్‌కు వెళ్లాలా? ఆలోచించాలి’ అన్నారు.

ఇది చదవండి : గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన…

బీజేపీ ఎంపీలు నలుగురు ఏం చేశారు..

‘ఇంతకు ముందు నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేశారు? ఏకాన పైస తెచ్చారా? ఏమన్నా రాష్ట్రానికి లాభం చేశారా? దయచేసి ఆలోచన చేయాలి. అవలోకగా, తమాషాగా ఓట్లు వేయొద్దు. భయంకరంగా దేశం అన్నివిధాలా నష్టపోతున్నది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలు ఉన్నయ్‌. 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నది. 70వేల టీఎంసీల నీళ్లు నదుల్లో ప్రవహిస్తున్నయ్‌. 40కోట్ల ఎకరాల సాగుభూమికి సరిపడా నీళ్లు ఉన్నయ్‌. కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే.. బ్రహ్మాండంగా యావత్‌ దేశం కరెంటు కొరత లేకుండా ఉంటుంది. మొన్న నన్ను ఆగవట్టి బ్రేక్‌ కొట్టారు కానీ.. మొన్న గెలిచి ఉంటే.. ఆపాటికి దేశంలో చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బతగిలింది పర్వాలేదు. ఓర్సుకుందాం.. తట్టుకుందాం. ఉద్యమాలు చేసినోళ్లం. ఓపిక ఉన్నోళ్లం. పేగులు తెగేదాక కొట్లాడే శక్తి.. ధైర్యం ఉన్నోళ్లం.. ధైర్యంగా ముందుకెళ్లాలి. దళితబంధు తెచ్చినా.. చేనేత కార్మికుల కోసం తెచ్చినా.. రైతుబంధు తెచ్చినా.. కులం, మతం, జాతి ప్రసక్తి లేకుండా.. మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు పెట్టినా.. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెట్టిన కులం.. మతం, జాతి చూడలేదు. ఇవాళ మనం తెలంగాణ జాతిగా నిలబడాలి. కలబడాలి. ఇక్కడికి ఉపన్యాసం చెప్పేందుకు రాలేదు. ఒక సందేశం, ఒక టేకాఫ్‌.. ఇది లక్ష్మీగడ్డ కాబట్టి.. ఇదేగడ్డ నుంచి తెలంగాణ సాధించాం కాబట్టి.. నేను మీ అందరికీ నమస్కరిస్తున్నా’నన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: