Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News ఏడేళ్లకే పోలీస్ అధికారి..

ఏడేళ్లకే పోలీస్ అధికారి..

by Rama
7 years police

గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి (7) 4 వ తరగతి పూర్తీ చేసుకున్నాడు. గత సంవత్సరం పాటశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవ్వడం తో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి రెక్టం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో వైద్య చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరిక ను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు ద్వారా చిన్నారి నీ బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి అతని కోర్కె గురించి తెలియజేశారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారి నీ సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారి గా సిట్ లో కూర్చోబెట్టి అతని కోర్కె ను తీర్చారు. బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారి కి పోలీసు గౌరవ వందనం చేసి , చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.

Read Also..

Read Also

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: