ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాలకులకు గుణపాఠం తప్పదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ విజయం ప్రజా విజయమని ధన బలం కన్నా ప్రజాబలం గొప్పదని నిరూపించారన్నారు. అహంకారంతో తమకు ఎదురులేదని విర్రవీగిన బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం జరిగిందని అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇకపై ప్రజా భవన్ వీటిలో ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని తెలిపారు. పాలకులు ప్రజా సేవకులు అనే విషయాన్ని మరువద్దని ఆయన గుర్తు చేశారు. చివరిగా కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.