కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా, వైద్యమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది నియామకాల కోసం మాత్రమే. గత పదేళ్లల్లో నిరుద్యోగుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పక్కకు పెట్టింది. ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే పేపర్లు లీక్ అయి, జిరాక్స్ సెంటర్లలో తేలితే.. పట్టించుకునే దిక్కు లేకుండా నిరుద్యోగులను వదిలేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఆ ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి