కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా, వైద్యమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది నియామకాల కోసం మాత్రమే. గత పదేళ్లల్లో నిరుద్యోగుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పక్కకు పెట్టింది. ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే పేపర్లు లీక్ అయి, జిరాక్స్ సెంటర్లలో తేలితే.. పట్టించుకునే దిక్కు లేకుండా నిరుద్యోగులను వదిలేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఆ ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి