కాంగ్రెస్, టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి మారిన నేతలకు ప్రజలు ఝలక్ ఇచ్చారు భారీ ఆశలతో బీఆర్ఎస్లో చేరిన వారికి భంగపాటు తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి నుంచి గెలిచి పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర రావు, పినపాకలో రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. ఇల్లెందులో హరిప్రియ, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డికి కూడా పరాజయం తప్పలేదు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పాలేరులో ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో సురేందర్, కొల్లాపూర్ లో హర్షవర్థన్ ఘోరంగా ఓటమి చెందారు. పార్టీ మారిన వారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.