నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక యువత తెలంగాణ, కర్ణాటక వెళ్లాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా గత ఐదేళ్లలో ఉన్నత విద్య పూర్తి చేసిన నిరుద్యోగ యువత కనిపిస్తున్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన చేస్తున్న సమయంలో అంజనాస్ ఫౌండేషన్ వారు ముందుకు రావటంతో వారితో కలిసి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతీ యువకులు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందాలని కోరారు. ఇంకా మరిన్ని కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి