267
బీహార్లో ఏర్పాడిన జనతాదళ్ యునైటెడ్, బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అదే సింహాసనాన్ని దక్కించుకున్నారు నితీష్ కుమార్. దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పార్టీ నేత ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, బీహార్ వాసి అయిన ప్రశాంత్ కిషోర్ మాత్రం సరికొత్త విషయాన్ని వెల్లడించారు. బీహార్ లో కొత్తగా ఏర్పాటైన కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగదని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అధ్వర్యంలోని జేడీయూ ప్రభుత్వానికి ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలం ఉండవచ్చని కిషోర్ తెలిపారు.





Total views : 78503