Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra PradeshWest Godavari రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి..

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి..

by Rama
purandeswari

ఏలూరు జిల్లాలో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామన్నారు. ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామన్నారు. బీజేపీ ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం జరిగిందన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. ప్రస్తుతం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి తేల్చి చెప్పారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: