Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Telangana నేడు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నేడు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

by Satya
CM Revanth Reddy

నేడు ‘రైతు నేస్తం’ కార్యక్రమం:

నేడు ‘రైతు నేస్తం(Raitu Nestham)’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహనను కల్పించనుంది. ఆవిష్కరణలు, విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది చదవండి: మంత్రాలపెట్టెను బయటపెట్టిన జనగామ పోలీసులు..

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్(Conference system) ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించింది. ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొదట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 110 రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ ఉగాది నాటికి అన్ని రైతువేదికల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. …
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025300
Total views : 146865

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.