Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Latest News ప్రత్యర్ధులుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సండ్ర వెంకట వీరయ్య

ప్రత్యర్ధులుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సండ్ర వెంకట వీరయ్య

by Rama
sandra venkata veeraiah

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సండ్ర వెంకట వీరయ్య,రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర మాట్లాడుతూ బిఆరెస్ పార్టీ గెలిచిన తరువాత సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసే విషాయాలను మండలాల వారిగా వెల్లడించారు.. కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే క్రిష్టమస్ లోపు సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా దళితబందు అమలు చేస్తాం అని అలా చేయ్యకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగాం అని తెలిపారు. పది జిల్లాలను 30 జిల్లాలు చేసిన ఘనత కేసిఆర్ దే అలానే కేసిఆర్ సారధ్యంలో సత్తుపల్లి, అశ్వారావుపేట రెండు కలుపుతూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం అని హామి ఇచ్చారు.. ప్రత్యర్దులు బెట్టింగ్ లు ఉసి కలుపుతున్నారని, విష ప్రయోగాలు చేస్తూ కాంగ్రెస్ కు ఇంత మెజారిటీ వస్తుందని అప్పుడే బుకీలను ఏర్పాటు చేసి కుట్ర రాజకీయాలు చేస్తూరని కుట్ర రాజకీయాలకు ప్రత్యర్ధులు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు… సామాజిక వర్గాలను రెచ్చగొడ్డి ఊసిగొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు…నేను ప్రచారానికి వెళితే కావాలని కొంతమందిని పంపి అడ్డుకునేలా చేసి సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టి ఆనందం పడుతున్నారు‌…నేను ఇలాంటి పని చెయ్యాల్సి వస్తే ఒక్కరు కూడా ప్రచారానికి వెళ్ళాలేరు. ఇలాంటి సంకృతి దూరంగా ఉండి ప్రజల మనల్ని‌పొంది గెలవాలి కానీ కుట్ర రాజకీయాలు తప్పుడు పద్దతిలో చిల్లర వ్యహరంలో రాజకీయాలు చేయ్యోద్దని ప్రత్యర్ధులు హెచ్చారించారు‌.. అలానే గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని నన్ను గెలిపించలేదు సైనికుడిగా పని చేశా కాబట్టే గెలిపించారని తెలుగుదేశం పార్టీ లో చివర వరకు ఉన్న నాయకుడిన్ని నేను అని వెల్లడించారు. తెలుగుదేశం జెండా కట్టాని వాళ్ళు చంద్రబాబు జైల్ కి వెళితే మాట్లాడని వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల వెంట పడుతున్నారని ప్రత్యర్ధి పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012573
Total views : 75441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.