కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిందన్నారు. తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రంని ఆరోపించారు. విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చ జరిగింది. తమకు మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ కే ఎక్కువ నిధులు ఇచ్చిందని, కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరును ప్రస్తావించలేదని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. పూర్వోదయ స్కీమ్ లోనూ కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు కేంద్రం అనుసరిస్తున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా సభ్యులంతా కలిసి రావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి