కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిందన్నారు. తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రంని ఆరోపించారు. విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చ జరిగింది. తమకు మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ కే ఎక్కువ నిధులు ఇచ్చిందని, కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరును ప్రస్తావించలేదని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. పూర్వోదయ స్కీమ్ లోనూ కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు కేంద్రం అనుసరిస్తున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా సభ్యులంతా కలిసి రావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 197090