కాకినాడ జిల్లా పెద్దాపురంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సేవ చేసేందుకు టిడిపి నేతలు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటివరకు జరిగిన పాలన పై సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చినరాజప్ప ఫోకస్ పెంచారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన రాజప్ప తాజాగా పెద్దాపురం చంద్రబాబు శతాబ్ది పార్కును పరిశీలించి పార్కు లో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు పార్కు మెయింటినెన్స్ చేయకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆషాడ మాసం వస్తుండడంతో పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో శతాబ్ది పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాజప్ప మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
2014 – 2019 మధ్య తాను మంత్రిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సర్వనాశనం చేశారని పార్కులకు సైతం తాళాలు వేశారని వైసిపి నాయకులకు అంటకాగిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 79705