కాకినాడ జిల్లా పెద్దాపురంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు సేవ చేసేందుకు టిడిపి నేతలు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటివరకు జరిగిన పాలన పై సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చినరాజప్ప ఫోకస్ పెంచారు. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన రాజప్ప తాజాగా పెద్దాపురం చంద్రబాబు శతాబ్ది పార్కును పరిశీలించి పార్కు లో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు పార్కు మెయింటినెన్స్ చేయకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆషాడ మాసం వస్తుండడంతో పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో శతాబ్ది పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాజప్ప మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
2014 – 2019 మధ్య తాను మంత్రిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సర్వనాశనం చేశారని పార్కులకు సైతం తాళాలు వేశారని వైసిపి నాయకులకు అంటకాగిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 202704