Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి శబరిమలకు ప్రత్యేక రైలు

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి శబరిమలకు ప్రత్యేక రైలు

by Prakash
rail ways

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు, కొల్లం వరకు ప్రత్యేక రైలును శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ లన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్లలో శ్రీకాకుళం జిల్లాలో వివిధ సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా జిల్లా లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.మొదటిసారి ఎంపీగా ఎన్నికైన అనంతరం పార్లమెంట్ సభలో ఉత్తరాంధ్ర ప్రజలకు కాశి వెళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసానని, ఎన్నోసార్లు అధికారులను, మంత్రులను కలిసి విణతి పత్రం అందించడంతో విశాఖపట్నం నుంచి వారణాసి రైలు ఏర్పాటు చేశారని అన్నారు. శ్రీకాకుళం నుండి కొల్లం వరకు వెళ్లే శబరిమల ప్రత్యేక రైలు అయ్యప్ప భక్తులు మాల ధారణ విరమించే సమయం వరకు నడుస్తున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: