రాయదుర్గం పట్టణం బళ్ళారి రోడ్డులోని టెక్స్టైల్ పార్క్ వద్ద గత మూడు రోజుల నుండి చెత్తకు నిప్పు అంటుకుని విషవాయువు వెదజల్లుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక వార్డ్ ప్రజలు, వాహనదారుకు పేర్కొన్నారు. గురువారం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా విషవాయువును పీల్చుతూ అనారోగ్యాలకు గురి అవుతున్నామని పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతూ పనులు కొనసాగిస్తున్నామన్నారు. మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించడం లేదన్నారు. ఈ విషవాయువు వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలకు దగ్గు జ్వరం తో గత మూడు రోజుల నుంచి అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విషవాయువు రాకుండా చూడాలన్నారు.
Anantapur District news
మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరి, రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని, కరోనా కష్టకాలంలో పని చేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ట్రెజరీ ద్వారా 010 ప్రకారంగా వేతనాలు అమలు చేయాలని, రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే నిలబడిపోయింది.