అంతర్రాష్ట్ర దొంగలను చేకచక్యంగా పట్టుకున్నారు మదనపల్లి పోలీసులు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వీరి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని అమాక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు ముఠా సభ్యుల ను మదనపల్లి పోలీసులు ఎట్టకేలకు కటకటాలలోనికి పంపారు. మా భూమిలో లంకె బింద దొరికింది, బయట విక్రయించాలంటే వివిధ శాఖల అధికారులతో సమస్యలు ఉంటాయని, కుటుంబ అవసరాల కోసం గుట్టుగా బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని నమ్మించి నకిలీ బంగారు పూసలు ఇచ్చి ఘరానా మోసానికి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మదనపల్లి ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ బంగారం సెల్ ఫోన్లు సీజ్ చేసి ఏడుగురని అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి, కేశప్ప, సీఐ మహబూబ్బాషా తెలిపారు.
Andhra Pradesh News
జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవదన్నారు డిఎస్పి మహబూబ్ బాషా .అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం లో గత నెలలో చిన్న బిడికి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నీలమాలప్ప,కర్ణాటక రాష్ట్రం కు చెందిన ఆవుల రామకృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు కేజీలు బరువు గల నాలుగు వెండి అచ్చులు,ఎనిమిది గ్రాముల బరువు గల మూడు బంగారు తాలి బోట్లు, రూ.10 వెలు నగదు తొ పాటు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకొన్నట్లు వారు తెలియజేశారు .అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు .విరి పై గతంలో రాయచోటి అర్బన్, పీలేరు తో పాటు నందలూరు పోలిస్ స్టేషన్ లలో కుడా దొంగతనం క్రింద కేసులు నమోదై ఉన్నట్లు వారు వెల్లడించారు .చోరి కేసును నమోదు చేసి నెలలోనే నిందుతులను అరెస్ట్ చేయడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన రాయచోటి రురల్ సీఐ తులసి రామ్ ,యస్ ఐ రామకృష్ణా రెడ్డి వారి సిబ్బందిని డిఎస్పి అభినందించ్చారు
గుంటూరు లో చైన్ స్నాచింగ్ దొంగను పట్టుకున్న నల్లపాడు పోలీసులు. నల్లపాడు పొలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు
నల్లపాడు SHO రాంబాబు మాట్లాడుతూ నగరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు. సమ్మితి నరసింహ అనే ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసగా మారి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డాడు. ముద్దాయి 2 కేసులలో దొంగ గా నిర్ధారించారు… ముద్దాయి వద్ద నుండి 39 గ్రాముల బంగారం రికవరీ చెయ్యటం జరిగింది. రికవరీ చేసిన బంగారం విలువ 2 లక్షల రూపాయలు వరకు ఉంటుంది దొంగతనానికి ఉపయోగించిన 2 వీలర్ ను సైతం స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసాము..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా, పెదవేగి మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి డీ.కమలేష్(14) అర్ధరాత్రి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పంచనామాల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి కమలేష్ స్వగ్రామం భీమడోలు మండలం అర్జ వారి గూడెం. విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు ఆర్డిఓ ఎస్కే కాజా వలి ప్రిన్సిపాల్ , విద్యార్థులను అడిగి వివరాలు రాబడుతున్నారు
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు.తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన, టిడిపి నాయకులకు తో కలిసి గండేపల్లి మండలం యల్లమిల్లి అడ్డరోడ్డు వద్ద నుండి గండేపల్లి శివారు సింగరంపాలెం రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసిఅధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నెహ్రూ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై టిడిపి జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారి ఇది కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గండేపల్లి మండలంలో నిర్వహించామని పెద్దాపురం మండలం గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉందని దీనిని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ను ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని ఈ అసమర్ధ ఎమ్మెల్యే వల్లే ఈరోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గం లోని రోడ్లన్నీ గుంతలు ,గొయ్యలు పుట్చాలని కోరారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక మరమ్మతులు చేయవచ్చని అన్నారు. ప్రతి మంగళవారం నువ్వు తీసుకువచ్చే రిజర్వ్ బ్యాంక్ అప్పులో 1200 కోట్ల రూపాయల కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయని ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకుని మీరు ఓట్లు కోసం రావాలని, ఎన్నికల ప్రచారం రావాలని డిమాండ్ చేసిన జ్యోతుల నెహ్రూ లేదంటే రేపు రాబోయే జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని అన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం, త్వరలోనే స్క్వాష్ పిటిషన్ కూడా అనుకూలంగా వస్తుంది. ఎంతో పేరుగాంచిన గుడివాడ, నాని పనితనంతో గుంతల వాడగా మారింది. గుడివాడలో రోడ్లు వేయ్యనని పబ్లిక్ మీటింగ్ లో, కొడాలి నాని నీసిగ్గుగా చెబుతున్నాడు హైదరాబాద్లో ఉండే వ్యక్తికి గుడివాడ ప్రజల రోడ్ల కష్టాలు ఎలా తెలుస్తాయి…. ప్రజలతో సంబంధం తెగిపోయి అరాచకాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి, కొడాలి నానికు బుద్ధి చెప్పి తీరుతాం. సొల్లు వాగుడు కట్టి పెట్టీ ప్రజల్లోకి రా.. ని బడ్డారం బయట పడుతుంది. పక్క రాష్ట్రాలు మన రోడ్ల మీద జోకులు వేసుకుంటున్న సీఎంకు చిమకుట్టినట్లు లేదు. టిడ్కో ఇల్లంటే టిడిపి, చంద్రబాబే గుర్తుకు వస్తారు. తమ సొంత డబ్బులతో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వైసిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు. లెజెండ్ అయిన చంద్రబాబు గొప్పతనాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు. కొడాలి నాని చీకటి సామ్రాజ్యాన్ని నడిరోడ్డుపై నిలబెడతాం
చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి, కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు
టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి, జనసేన నేతలు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తమ అధినేతకు అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని, ఎలాంటి అవినీతి చేయిని చంద్రబాబు నాయుడు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని, అధికారి పార్టీ గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం మేధో గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపట్టాన్ని , ప్రసాదాలను అందించారు
స్థిరాస్ల వ్యవహారంలో సివిల్ కోర్టుల పరిధిని మినహాయించి ట్రిబ్బినల్స్ ఆశ్రయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ఆఫ్ 2023 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పలమనేర్ న్యాయవాదులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు పలమనేరు భారసోసియేషన్ అధ్యక్షులు కే లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పలు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నూతన చట్టం ప్రకారం రైతులు నివాస స్థలాలు యజమానులు తీవ్రంగా నష్టపోతారని స్థానికంగా అందుబాటులోని సివిల్ కోర్టు లను ఆశ్రయించే అవకాశాన్ని కోల్పోతారని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంలోనే సంబంధిత అధికారులు హక్కులను నిర్ణయించే విధంగా ఈ చట్టం ఉందని సెక్షన్ 38 ప్రకారం పూర్తిగా స్థిరాస్తి హక్కులపై సివిల్ కోట్లను ఆశ్రయించుటకు వీలులేదని తెలిపారు. స్థిరాస్తులపై తమ హక్కులను కాపాడుకోవడానికి జిల్లా స్థాయిలో ట్రిబ్బినల్స్ ను ఆశ్రయించాల్సి వస్తుందని దాని తర్వాత రాష్ట్ర స్థాయి ట్రీబ్బినల్సుకు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఈ చట్టం వలన రైతులు స్థిరాస్తి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కె లక్ష్మీపతి కుప్పరాజు పరమశివప్ప ఎల్ భాస్కర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు
కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను





Total views : 199245