గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు లో ఉన్న వాసవి ఎలక్ట్రికల్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.. లక్షన్నర విలువచేసే ఆటో ఎలక్ట్రికల్ షెటర్ ను ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 10 వేల రూపాయల నగదు తో ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాప్ లో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా వెళుతున్న స్థానికులు షట్టర్ ద్వంశమై ఉండడాన్ని గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు. దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశించారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…అనంతరం క్లూస్ టీం తో పూర్తి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందునా 24 గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్నచోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ ప్రయత్నం జరిగితే ఇంక ప్రజలకు రక్షణ ఎలా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. షాపులో ఇంకా ఎంత సరుకు దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమణ తెలిపారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.