చాలామందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం శుత్రువులను పెంచడమే కాదు. స్నేహితులను, కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది. కొపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు తింటే వెంటనే కోపం కంట్రోల్ అవుతుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్లో పసుపు చేర్చుకుంటే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమిన్ మన శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి ‘ఫీల్-గుడ్’ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అరటిపండులో విటమిన్ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. డోపమైన్ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్ చేస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి కోపాన్ని తగ్గిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకతే వేరు ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాలు నరాల కు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరంలో కోపాన్ని సైతం తగ్గిస్తాయని భావోద్వేగాలని నియంత్రిస్తుందని తెలుస్తోంది. శరీరానికి జుట్టుకు ఎంతో మేలు చేసే అవిస గింజలు కోపాన్ని సైతం నియంత్రిస్తాయని తెలుస్తోంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్ను మెండుగా ఉంటాయి. అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్ చేసే సూపర్ఫుడ్గా పనిచేస్తుంది.
banana
బొప్పాయిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరెంజ్లో అత్యధికంగా కమలాల్లో లభించే సి విటమిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది. అరటిపండులో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు. బంగాళ దుంపలో జింక్, విటమిన్ సి పెరిగి రోగని రోధకశక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. చాక్లెట్లో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ – డివ్రేస్సెంట్గా పనిచేస్తుంది. యాప్రికోట్లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరుగులోని విటమిన్ బి నెర్వస్నెస్ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సిజన్ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
Read Also..
Read Also..
చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. వరి, అరటి, పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి. అప్పుచేసి పంట పండిస్తున్నామని ఈ విధంగా ఏనుగులు తొక్కి తిని నాశనం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కుప్పం వెళ్లే రహదారిపైనే కాసేపు ఏనుగులు ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్వం రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7 గంటల కల్లా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు. మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. అప్పుడు కష్టంతోపాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటివారు ఆరోగ్యంగా ఉండేవారు. మంచి ఆహారం కూడా తీసుకునేవారు. కానీ కాలం మారిపోయింది. మనుషులు కాలం వెంట పరుగెడుతూ ఉన్నారు. ఆఫీస్లో కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడిపి ఇంటికి వచ్చాకా టీవీ, మొబైల్ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు. రాత్రిళ్లు 11 లేదా 12 గంటలు దాటితేగాని నిద్రపోరు. పడుకున్నా ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి ఉదయం 6 లేదా 7 గంటలకు నిద్రలేస్తారు. అంటే వారు నిద్రపోయే సమయం కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు ‘ఆరోగ్యకరమైన నిద్రకు. ఆరు సూత్రాలు’ పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు. రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా మంచి నిద్ర పోవచ్చు. బాదం పప్పు తీసుకోవడం కండరాలు, మనసు రిలాక్స్ అవుతాయి. తద్వారా చక్కని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా అందులో ఉండే ‘మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు పై నియమాలు పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాడా పడుతుంది. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్మీటర్స్ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి. చక్కగా నిద్రపోయేలా చేస్తాయి.
గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే అరటి పండ్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.పోషకాలు,కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అరటిపండ్లలో పోషకాల స్థాయిలను గమనిస్తే ఒక 80గ్రాముల అరటిపండును తీసుకోవడం ద్వారా 65కిలో క్యాలరీల ఎనర్జీ,1గ్రాము ప్రోటీను,0.1 ఫాట్16. 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్,1.1 గ్రాముల ఫైబర్,264మిల్లి గ్రాముల పొటాషియం అందుతాయి. అరటిపండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. అరటిపండ్లలోని ఫైబర్ కారణం గా కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్స్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు పనిచేస్తాయి.






Total views : 75349