సింగరాయకొండలో పాతకక్షల నేపథ్యంలో యువకుడును గొంతు కోసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడుతా ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడలను చూడటానికి వచ్చిన మూలుగుంటపాడు గ్రామానికి చెందిన మిరియం శ్రీకాంత్ యువకుడు ను, ఊళ్లపాలెం కు చెందిన కొల్ల సాయి అను యువకుడు మద్యం తాగి కత్తితో మెడకోసిన సంఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుని ఒంగోలు రిమ్స్ కు తరలించగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
business
హైదరాబాద్ లోని అసెంబ్లీలో శనివారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికుడిగా దుస్తులు ధరించి, తలకు హెల్మెట్, తట్ట చెమ్మస్ తో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారికి రక్షణగా ఉంటానని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ పేరు మీద అర్చకులు అభిషేకం చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తో పాటు ఆలయ ధర్మకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది. కాలేజీలకు వెళ్లే బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అంతా ఉచిత బస్సు సౌకర్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా తెలంగాణ లోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కలిగిందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భారత్, సోనియా గాంధీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని మిగతా 6 గ్యారంటీలను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే చేవెళ్ల సర్పంచ్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా సోనియా గాంధీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే లోకల్ భాడి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలపాలని అమె కోరారు. తెలంగాణా మహిళల తరుపున మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల ప్రయాణికులు మాట్లాడుతూ.. మేము ఎప్పుడు అనుకోలేదని ఇలాంటిది ఉచిత ప్రయాణం చేస్తామని అని చాలా సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు. గృహ సముదాయాలు, విద్య సంస్థల సమీపంలో వైన్ షాపు ఎర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపు ఎదురుగా స్థానికులు డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలకు విధ్యార్థులు, విధ్యార్థినిలు వారి తల్లిదండ్రులు వస్తుంటారని దేవాలయం లాంటి విధ్యా సంస్థ ఎదురుగా అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు విధ్యార్థులు తిరిగే చోట మద్యం బాబులు మద్యం సేవిస్తూ రోడ్లు పై ఉంటే తివ్ర అంటాకం ఎర్పడుతుందన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా సానుభూతి పరుల ఓట్లు ఫారం 7 ద్వారా తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని నారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల మాటలకు అధికారులు తలోగ్గి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన ఓటరు ఎక్కడున్నా వచ్చి ఓటు వేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈరోజు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ దేవదేవుడుని పరమేశ్వరుడిని ప్రార్థించడమైనది. అలాగే సోనియాగాంధీ కి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల మ్యానిఫెస్టోలో ఈరోజు రెండు గ్యారంటీ పథకాలను అమలులోకి తీసుకుని వస్తున్నారు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సలీం పాష, మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి పింగళి రాకేశ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టే ప్రభుదాస్, బిసి సెల్ పట్టణ అధ్యక్షులు తంగెళ్ళ క్రిష్ణా మోహన్, కాంగ్రెస్ నాయకులు పోతుల శ్రీనివాస్, యం.డి సలీం, ముద్ధమల్ల రవి, NSUI రాష్ట్ర నాయకులు పర్లపెల్లి నాగరాజు, జిల్లా St cel కార్యదర్శి మానుపాటి సూర్య చిలువేరు రాజమౌళి, మొలుగూరి సమ్మయ్య, గుర్రపు మురళి, గుర్రపు ప్రవీణ్, గుల్లీ సమ్మయ్య, చిట్యాల శంకర్, పోతిరెడ్డి మల్లయ్య, సిరిపురం కుమార్, చెంచల శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య, గడ్డం రమేష్, అకినపెల్లి మహేందర్, రాజ్కుమార్ , అశోక్, దొడ్డె నవీన్, పాతకాలం అనిల్, పనికెల్లా శ్రీకాంత్, మొలుగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 200 మంది నీరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 77 వ జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రజల అండతో తెలంగాణ గెలుపును బహుమతిగా ఇచ్చామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే 6 గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ భీమా 10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించడం సంతోషమన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ పుట్టినరోజును పండగ లా జరుపుకుంటున్నారన్నారు.
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారo అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..





Total views : 91168