హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి హన్మకొండ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు విజయయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మథర్ థెరిస్సా విగ్రహానికి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ లో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయం కోసం ప్రయత్నాలు చేసినా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎమ్యెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని, నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నారని అన్నారు. చాలా రోజుల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
business
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు. ఈ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు ఒక ప్రమాదం జరిగి ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులు అందరూ కలిసి విగ్రహం ప్రతిష్టించారు. ఇప్పుడు ఇలా జరగటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని, ఇలాంటి ఆకతాయి పనులు చేసిన వారిని పోలీసులు వెంటనే పట్టుకొని తగు శిక్ష విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also..
నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ, దుమ్ము, దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మిల్లు నుండి వెలువడే కాలుష్య వ్యర్ధాలు రాకుండా అరికట్టాలని ప్రశ్నించిన మాపై మహిళలని కూడా చూడకుండా చెప్పుతో కొడతానని దుర్భాషలాడి మీకు చేతనైనది చేసుకోమని, బెదిరింపులకు గురి చేస్తున్నారని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిండు వెలువడే కాలుష్యంతో కంటిచూపు సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ 30 నుంచి 50 వేల రూపాయలు హాస్పటల్ కు ఖర్చు చేశామని అయినా ఆరోగ్యం కుదట పడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘురామ రైస్ మిల్లు నుండి వెలుపడే కాలుష్యాన్ని నివారించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో కింద పడి మృతి చెందాడు. ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు అహ్మద్ ను గమనించకుండా ఆటో స్టార్ట్ చేయడంతో ప్రమాదవశాత్తు ఆటో కింద పడి బాలుడు మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ఆటో కింద పడి మరణించాడని బాలుడి తండ్రి, తాత ఆరోపించారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
Read Also..
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముగ్గురు మంత్రులు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ర్యాలీగా ఖమ్మం బయలు దేరారు. అనంతరం మంత్రులు పాలేరు నుండి భద్రాచలం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఉదయం సెక్రటేరియట్ లోని 5 వ అంతస్తులో ఉన్న రోడ్లు భవనాల మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం సరిగ్గా 9.45 నిముషాలకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసీనులయ్యారు. వేద పండితులు, మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేద ఆశీర్వచనం చేశారు. మంత్రిగా చార్జి తీసుకున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కూడా శుభాభినందనలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా.. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దేవరపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నర్సీపట్నం పరిధిలో గంజాయిని కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి 326 కేజీల (16 లక్షల విలువచేసే) గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవరపల్లి పోలీసులు ఒక బోలేరా వాహనం, నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు. ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారు ను దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించారు. ఆలయంలో రద్దీతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.
Read Also..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ. బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రత్యేక్షంగా ఉన్న వారు చూస్తుండగానే బైక్ నుండి మంటలు వ్యాపించి క్షణాల్లోనే బూడిద అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలనికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైనా వ్యక్తి ఎవరు అనే కోణం లో పోలీస్ లు ధర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పూర్తిగా కాలిపోవడం తో వివరాలు తెలియరాలేదు. పోలీస్ లు ధర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.






Total views : 90434