హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి హన్మకొండ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు విజయయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మథర్ థెరిస్సా విగ్రహానికి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ లో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయం కోసం ప్రయత్నాలు చేసినా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎమ్యెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని, నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నారని అన్నారు. చాలా రోజుల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ..
308
previous post





Total views : 79590