విజయవాడ, ఎమ్మెల్యే రామ మోహన్, ఆయన సతీమణి కృష్ణా జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తో భేటీ అయిన కేశినేని శ్వేత. రాజీనామా కారణాలు, తండ్రి కేశినేని నాని కి సంబందించిన అంశాలపై చర్చ. సుమారు అరగంట నుంచి ముగ్గురూ భేటీ. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత. కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా రాజీనామా చేస్తున్న ఆయన కుమార్తె శ్వేత. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కు మేయర్ పదవి విషయంలో మొదలైన కేశినేని నాని అసంతృప్తి. టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టిన ఎంపీ నాని. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని వ్యతిరేకించిన మరో వర్గం. అప్పటినుంచి అధిష్టానం, వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలు పెట్టిన ఎంపీ నాని. రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ. ముందుగా తన కూతురు శ్వేత చేత రాజీనామా చేయిస్తున్న నాని.
Chandra babu
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. 9 గంటలకు అక్కడ కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి మేయర్ మున్సిపల్ కమిషనర్ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరుతారు.
టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆచంటలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు కొవ్వలి యతీరాజ రామమోహన్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అందుకు ఆచంటలో నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం వేదిక అవుతుందని ఆయన అన్నారు. టిడిపి సీనియర్ నేత కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి వెళ్లేందుకు నరసాపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మిత్రపార్టీ జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘రా.. కదలి రా..’ పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాయలో పడ్డారని.. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారన్నారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. 2029 నాటికి ఏపీ నంబర్ వన్ కావాలని ప్రణాళికలు రచించామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. తన అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
విజయవాడ, టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ పోస్ట్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా.
కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గెలిచారు. రెండుసార్లు వైసిపి నేత, ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత చేకూరింది. యనమల రామకృష్ణుడి వయసు మీరడంతో తన వారసురాలిగా తన కుమార్తె దివ్య ను రంగంలోకి దింపారు. ఆయనకు కుమారులు లేరు. దీంతో వారసత్వాన్ని కుమార్తె దివ్యకు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించారు. దివ్యను ఇంఛార్జి గా ప్రకటించారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది, రోడ్డున పడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరినీ కలిపారు. కృష్ణుడు కి మంచి భవిష్యత్తును ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా వ్యవహారం నడిచింది. ఒకటో తేదీ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మరోసారి అన్నదమ్ముల వివాదాలు బయటపడ్డాయి. రోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. అన్నదమ్ముల మధ్య ఇలా ఘర్షణ జరిగితే ఈ సీటు వైసిపి ఖాతాలోకి పోవడం ఖాయమని సీనియర్ కార్యకర్తలు వాబోతున్నారు. ఎలాంటి పదవులు లేవు, అన్నదమ్ములు, కుమార్తె వీరికే పదవులా, వీటికోసం కొట్టుకుంటారా, పార్టీని పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు.
Read Also..
గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు., చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జై జనసేన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా.. నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి, 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాలు అందిస్తారు. కుప్పంలోని పెద్దపులి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొత్తపేట పెద్ద మసీదులో మైనార్టీలతో కలిసి దువా లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుప్పం మండలం మల్లానూరు బస్టాండ్ లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి హైదరాబాదు చేరుకుంటారు.