Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra PradeshWest Godavari తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా..

తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా..

by Rama
yathiraja rammohan

టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆచంటలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు కొవ్వలి యతీరాజ రామమోహన్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అందుకు ఆచంటలో నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం వేదిక అవుతుందని ఆయన అన్నారు. టిడిపి సీనియర్ నేత కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి వెళ్లేందుకు నరసాపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: