బాపట్లలో 15వ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు. సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు. మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15వ రోజు అంగన్వాడీలు నల్ల బెలూన్లతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బెలూన్లు పాత బస్టాండ్ సెంటర్ లో వదిలి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 15 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయ చూపి వారి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
Chief Minister Jaganmohan Reddy
ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కేసాడు. రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితికి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.





Total views : 90533