ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.
crime news
అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలు నిత్యావసర సరుకులు. ఒక రైస్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది వీఆర్వో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా C I మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని వారి కుమారులు, కుమార్తెలు జాగ్రత్తగా చూసుకోవాలని గ్యాస్ బండ లీక్ అవటంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోయింది గ్యాస్ వాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద వయసు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కుమారులపై ఉందని ప్రతి పేదవాడికి సహాయం అందించే విషయంలో ముందుంటారని ఆపదలో ఉన్నవారికి ఒకరికి ఒకరు సహాయం తీసుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు.
కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు కు చెందిన చీమల మాధవరావు మోటార్ సైకిల్ పై వస్తుండగా ఇరువురు ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమల నరసింహారావు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యం అంటున్న జయచంద్ర రెడ్డి. పి.టీ.ఎం మండలం లో ఎలక్షన్ల హడావిడి నెలకొంది ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్న జయ చంద్రారెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అంటున్న జయచంద్రారెడ్డి. నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని పలు గ్రామాలలో విస్తృత పర్యటన చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి మండలంలోని టీ.సదుం పంచాయతీ పాపాగ్ని నది ఒడ్డున వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయంలో , చెన్నారాయనపల్లి వద్ద ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టి.సదుం పంచాయతీ నవాబు కోట,బెట్టకొండ, గ్రామాల్లో పర్యటించి ఎన్నికల పరిచయ కార్యక్రమాల్లో ముందున్న జయచంద్ర రెడ్డి. అనంతరం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సుసాధ్యతమని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్లను వేయకుండా గతంలో నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లను వేసి మేమే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపిన జయచంద్ర రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడారును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చేకూర్చాలని తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జయ చంద్రారెడ్డి.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ, పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద కుటుంబీకులు బోరుమన్నారు, సమాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26వ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారయించగా రెండు నెలలు క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆక్సిడెంట్ మరణం అయితే 40 లక్షల రూపాయలు వస్తాయని అలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మూరు స్మశానం లో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగరావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాస్ఫార్మర్ దగ్గరకు తీసుకొని వచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్టు క్రీయేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసులు సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా DSP కిషోర్ కుమార్ తెలిపారు. వీరి వద్దనుండి 2 సెల్ ఫోన్లు, 1 కార్ స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నామని తెలిపారు.
హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు.. గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న దామెర SHO మల్లేశ్ హత్యకు పాత కక్షలె కారణమని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే ఒక మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని కొట్టి ఆటోలో తీసుకుని పీడింగొయ్యి వద్ద పొలాల్లో వదిలి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ పూర్తిగా కాల్చి ఉన్న శవం పక్కన వెంకటేశ్వరరావు చెప్పులు, ఫోన్, బండి చూసిన బంధువులు వెంకటేశ్వరరావు శవం గా భావించి చనిపోయాడు అని భావించారు. అనంతరం కొద్ది గంటల సమయం తరువాత వెంకటేశ్వరరావు వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను బ్రతికె వున్నానని చెప్పేసరికి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను పట్టుకుంటామని తెలిపారు.