ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా? సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సాంసృతి మీ పరిపాలనలో జరగటంలేదా? గొంతు ఎత్తిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుట్రల రాజకీయాలతో బానిసలగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజులలో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణి చేసినట్లు పైకి చెప్తూ లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
cvr english
ప్రపంచమే ఆశ్చర్యంలో భారతదేశం వైపు చూసేలా చేసిన అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3. అగ్రదేశాలతో పోలిస్తే. అత్యంత తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన టాస్కు తీసుకొని సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం కారణంగా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగ ప్రత్యేకత. ఇప్పటివరకు మరే దేశం కూడా చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవటం తెలిసిందే.
ముందుగా అనుకున్నట్లే. చంద్రయాన్ 3 నుంచి సిగ్నళ్లు ఆగిపోయాయి. అద్భుత రీతిలో సిగ్నళ్లు వస్తాయని ఆశగా కొందరు చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇలాంటి వేళ. అంచనాలకు భిన్నంగా అద్భుతం అన్న రీతిలో. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాల నుంచి తాజాగా సిగ్నళ్లు అందుకున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్ లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే.. తాజాగా తన సేవల్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్నారు. భూమి మీద పదిహేను రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానమన్న సంగతి తెలిసిందే. పగటి వేళ ముగిసిన తర్వాత మొదలయ్యే రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండటంతో.. చంద్రయాన్ లోని పరికరాలు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. వాటి నుంచి మళ్లీ మేల్కొనటం సాధ్యం కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. అవి నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే వీల్లేదు. తాజాగా చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు తమ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చి. తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. అంగన్వాడీఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీ నేతలు ధర్నా. చల్లపల్లి ప్రదానరహదారి దిగ్బంధం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. అంగన్వాడి కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వామపక్ష పార్టీ నేతలు రహదారులను నిర్బంధించారు. చల్లపల్లి బస్టాండ్ సెంటర్ లో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా రోడ్డు దిగ్భందించి నిరసన తెలియజేస్తున్న అఖిలపక్ష ఆందోళనకారులను స్థానిక ఎస్ఐ. చిన్నాబాబు చెదరగొట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోన్నారు.
మంచిర్యాల జిల్లా, మందమర్రి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మందమర్రి పరీక్ష సెంటర్ లొ ఈ రోజు జరుగుచున్న నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష లకు హాజరు అవుతున్న 143 మంది విద్యర్థి ని విద్యార్థులకు ఉదయం 10-30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నరు విద్యార్థులు పరీక్ష కేంద్రం లొ బ్లూ, బ్లాక్ పెన్, హల్ టికెట్ ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి, అని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి తెలిపారు. టిజీటి కాగజ్ నగర్ నవోదయ విద్యాలయం నుంచి విద్య అధికారులు పర్యవేక్షణ లొ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు పోలీస్ భద్రత ఏర్పాటు చేసారు.
అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూలు తరలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఉదయం ఈ విమానం ప్రారంభమవుతుందని. సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు.వి.కృష్ణంరాజు జయంతి వేడుకలు. స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి, కుమార్తె ప్రసిద్ధ. కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య, కుమార్తె. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం.
మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండలంలోని జాజుల పేట గ్రామానికి చెందిన పూజిత అనే నిండు గర్భిణికి అర్థరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలో తీవ్రమైన నొప్పులు రావడంతో 108 వాహనాన్ని పక్కకి నిలిపి సిబ్బంది చాక చక్యంగా సుఖ ప్రసవం నిర్వహించారు. ఆ గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విపరీతమైన మెడనొప్పి తో ఇబ్బంది పడుతున్నారా? ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబ్ లు, డెస్క్ జాబ్ లు చేసేవాళ్ళు వారి కూర్చునే భంగిమ వల్ల, అలాగే ఆధునిక జీవితంలోని స్థిరమైన ఒత్తిళ్ల కారణంగా మెడ సంబంధిత సమస్యలకు ఎక్కువగా లోనవుతున్నారు. మీరు నిరంతరం మెడ నొప్పి లేదా ఇతర మెడ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారైతే, చాలా మెడ సమస్యలకు కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడం కూడా అవసరం.
- కోవిడ్ సమయంలో డెస్క్ వర్క్తో ఉన్న వ్యక్తులు ల్యాప్టాప్ల వాడకాన్ని పెంచారని మరియు అందువల్ల మెడ నొప్పి ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసే క్రమంలో భంగిమ మీ ఆరోగ్యాన్ని మీరు అర్థం చేసుకునే దానికంటే ఎక్కువగా దెబ్బతీస్తుంది.
- మీరు కూర్చునే తప్పు భంగిమ మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మెడ, భుజం, వెన్ను ఒత్తిడికి మరియు కీళ్ల క్షీణతకు కూడా కారణమవుతుంది. సుదీర్ఘమైన ఒత్తిడి, అసౌకర్య స్థితిలో నిద్రించడం, ఒత్తిడికి మెడనొప్పి కారణమవుతుంది.
- ఒత్తిడి కూడా మెడలోని కండరాలపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ మెడ కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మెడ నొప్పి వస్తుంది. దీర్ఘకాలిక మెడ నొప్పి కూడా చిరాకు, అలసట మరియు మీ జీవితానికి చాలా ఒత్తిడిని కలిగించే నిరాశకు కారణం కావచ్చు.
బిగుతుగా ఉన్న మెడ కండరాలను నార్మల్ గా మార్చటానికి ఫిజియోథెరపీ గొప్పది. ఫిజియోథెరపీ ద్వారా ఒత్తిడి వల్ల వచ్చే వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఫిజియోథెరపీ లో వారు మీకు మెడ నొప్పి వ్యాయామాలను బోధించగలరు మరియు ఇప్పుడు మెడ కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడగలరు మరియు భవిష్యత్తులో మీరు వాటిని కలిగి ఉండకుండా నిరోధించడంలో కూడా సహాయపడగలరు.