సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ భుతులను ఓపెన్ చేశారు ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు ఫాస్టాగ్ రాకముందు సొంతుర్లకు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బంది పడేవారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
cvr gold
కొత్త పింఛను మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది హెచ్ఐవీ బాధితులు రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. వీరిలో కొందరు పింఛను రాకుండానే కన్నుమూస్తున్నారు. మరోవైపు పింఛను అందుకునేవారిలో కొందరు అనర్హుల జాబితాలో చేరుతున్నారు. ఈ పరిణామాలు హెచ్ఐవీ బాధిత కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు, వాచ్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిలోనే హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. పనిచేయాలన్నా ఇలాంటి వారికి శరీరం సహకరించదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా తోడ్పాటును అందించే పింఛను కూడా రాకపోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 60శాతం మహిళలే ఉన్నారు. వన్ పెన్షన్ విధానంలో కొంతమందిని విద్యుత్తు వాడకం, సొంతిల్లు, ఇతర నిబంధనల అమలుతో లబ్ధిదారులు తగ్గిపోతున్నారు. బాధితుల్లో వితంతువులు ఉన్నట్లయితే వీరికి ఆ పింఛన్తోపాటు ఇదికూడా వచ్చేది. ఆధార్ సాయంతో రెండుచోట్ల ప్రయోజనం పొందుతున్నారన్న ఉద్దేశంతో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. సుమారు 35వేల మందికి పింఛను అందుతోంది.
నంద్యాల జిల్లా, నేటి నుండి ఈ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్ర,చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, మొవ్వ (మ) కూచిపూడి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాల, బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈ నెల 11 నుంచి 13 వరకు కబడ్డీ పోటీలు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొనున్నాయి. లక్ష రూపాయలు వరకు నగదు బహుమతి ఉంటుంది అని కన్వీనర్ గొట్టిపాటి సాయి అన్నారు. గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు చే బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అని అన్నారు.
ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది. నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం. నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి. 26మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా. బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





Total views : 90728