cvr live
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య, జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నగేష్ తమ్ముడు విజయ్ పాల్ రంజిత్ కుమార్ అక్కని సోమవారం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన రంజిత్, నగేష్ ను పొడిచాడు. ఈ ఘటనలో నగేష్ చనిపోగా, అతని తండ్రి యాదగిరి, కజిన్ పోతరాజు సాయి కుమార్ కు గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రసవించింది. ఆమెను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. తల్లీ శిశువు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మైనర్ బాలికను గర్భం దాల్చింది ఎవరు అని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్యప్తులో విషయం తెలనుంది.
శ్రీకాకుళం జిల్లా, జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం. సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల, కెవిపి.రామచంద్రరావు, సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి, మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. ఉదయం శ్రీకాకుళం నుండి బయలుదేరి ఇచ్ఛాపురం లోని వైయస్సార్ పైలాన్ ను సందర్శించనున్న షర్మిల. అనంతరం ఇచ్ఛాపురంలోని R.J. ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గo.ల నుండి 12: 30గo. లు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తో సమీక్ష సమావేశం..అనంతరం విజయనగరం పయనం కానున్న షర్మిల.
విజయవాడ, అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సమ్మె విరమిస్తున్నాం, రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం. జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపు చేస్తాం అన్నారు. సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అని వెల్లడించారు.
విజయవాడ, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం. జూలై లో జీతాలు పెంచుతాం. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కెనాల్ రోడ్ లో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మవారి ఊరేగింపులో తలెత్తిన వివాదంలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు కారం చల్లి దాడి చెయ్యడంతో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు ఇరువర్గాలను చేదరగొట్టడం తో వివాదం సద్దుమణిగింది.
అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.
ఖమ్మం జిల్లా, వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది . స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న స్వస్థలం మధిర మండలం మర్లపాడు.






Total views : 91177