కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
cvr live
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
ఎన్టీఆర్ జిల్లా, రేపటి దెందులూరు సీఎం సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై పార్టీ నేతల్లో గందరగోళం. మైలవరం కేడర్ ను సీఎం సభకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్న ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గం పరిశీలకుడు పడమట సురేష్ బాబు. ఈ నెల 4 లేదా 5 న ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెబుతానని ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం.
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
NTR జిల్లా, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం. అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు, ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు. అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు, భక్తులు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద దగ్ధమవుతున్న కారు, కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోయినట్లు సమాచారం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ముగ్గురు యువకులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో కారు దిగి పారిపోయిన యువకులు, టాటా హేరియర్ డీజిల్ కారు పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలు నిత్యావసర సరుకులు. ఒక రైస్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది వీఆర్వో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా C I మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని వారి కుమారులు, కుమార్తెలు జాగ్రత్తగా చూసుకోవాలని గ్యాస్ బండ లీక్ అవటంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోయింది గ్యాస్ వాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద వయసు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కుమారులపై ఉందని ప్రతి పేదవాడికి సహాయం అందించే విషయంలో ముందుంటారని ఆపదలో ఉన్నవారికి ఒకరికి ఒకరు సహాయం తీసుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు.






Total views : 91152