పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న, ఊరు ఆవుల పెద్దయ్య, కురువ రంగన్న, కురువ మల్లికార్జున, మద్దికేర ఓబులేసు, మారికి కోదండ బావిగడ్డ పెద్ద ఓబులేసు, ఏకాశి ప్రసాద్, ముట్టి వెంకట్ రాముడు, మద్దికేర పరుశురాముడు, కిష్టయ్య, బుగ్గల బ్రహ్మయ్య, మహేష్ మద్దికేర సుఖాలు, మారికి పెద్దయ్య, చిట్యాల రంగన్న, చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది.
cvr om
ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని(55) పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు. కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు. హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది. ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో కాని పనులను నా దృష్టికి తీసుకురావాలని అన్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తన దృష్టి కి తీసుకు రావాలని సూచించారు. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి కి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో రూపకల్పన చేస్తోంది అని అన్నారు.
అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం, హెలిఫ్యాడ్ స్థల పరిశీలన, వాహనాల కోసం పార్కింగ్, బహిరంగ సభా స్థలం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు, నాయకులు, ప్రజలు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.
దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ నాకు తిరువూరు సీటు ఇవ్వకపోవడం పట్ల నా మనసు గాయపడింది. ఒక ఎంపీ చెప్పిన మాట విని, ఒక ప్రణాళిక ప్రకారం, రెండుసార్లు గెలుపొందిన నాకు సీట్ లేకుండా చేశారు. నా నిర్ణయం రెండు రోజుల్లో ప్రకటిస్తా. నేను పోటీ చేయడం ఖాయం. ఎక్కడి నుంచి చేస్తాను అన్నది త్వరలో తెలియపరుస్తా. నేను ఈ పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ పవన్ కళ్యాణ్ ను కానీ దూషించిన సందర్భాలు లేవు. అది కూడా ఒక కారణం కావచ్చు అని నేను భావిస్తున్నాను. వారి ప్రణాళికలు ముందుగానే పసిగట్టి 20 రోజుల నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాను.
అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కొత్త పరిశోధన కనుగొంది. వీడియో గేమర్లు కోలుకోలేని వినికిడి లోపం లేదా టిన్నిటస్కు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం చూపిస్తుంది.
వినోద వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో వీడియో గేమింగ్ ఒకటి. అయినప్పటికీ, దాని పెరుగుతున్న ప్రజాదరణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఆందోళనలను కూడా పెంచింది. ఇప్పుడు, కొత్త పరిశోధన అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కనుగొంది.
50,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన BMJ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడిన సమగ్ర సమీక్ష పత్రం , గేమింగ్లో ధ్వని స్థాయిలు తరచుగా సురక్షిత పరిమితులకు సమీపంలో లేదా మించిపోతున్నట్లు కనుగొంది. గేమింగ్ నుండి ధ్వని స్థాయిలు గేమింగ్ సెంటర్లలో 80-89 డెసిబెల్స్ (dB) వరకు చేరుకుంటాయి మరియు ఇంపల్స్ సౌండ్లు, గేమ్ప్లే టచ్ సమయంలో 119 dB కంటే ఎక్కువ ఉండే సమయంలో పేలుళ్లు ఒక సెకను కంటే తక్కువగా ఉంటాయి. ఇవి సురక్షితమైన ఎక్స్పోజర్ పరిమితులను మించిపోయాయి, ఒక పత్రికా ప్రకటన వివరించింది.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 4000 మంది పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.