cvr om
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు. మేడారం జాతర నిర్వహణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి వద్ద నాయకపోడ్ గిరిజన పూజారులు మంత్రి సీతక్క, కొండా సురేఖ లకు ఘన స్వాగతం పలికారు. ఘట్టమ్మ తల్లికి మంత్రులు చీరే, సారె లను సమర్పంచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క, సురేఖ లను ఆశీర్వదించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం పరిసరాలను మంత్రి సీతక్క పరీశీలించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో దారుణం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా గ్రామంలోని యూత్ ఆధ్వర్యంలో మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. కాగా ఈ కోలాటం పోటీలలో మహిళలు కోలాట నృత్యం చేశారు. కాగా కోలాటం మధ్యలో అంతడుపుల రాజమణి (40) హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు, గ్రామ పెద్దలు జమ్మికుంట లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని తెలిపారని గ్రామ సర్పంచ్ దాసరి భద్రయ్య తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తో కల్వల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
వరంగల్, ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన. మొదట గట్టమ్మ వద్ద మొక్కులు. గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి, జాతర ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం. అధికారులకు దిశ నిర్దేశం చేయనున్న మంత్రులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్వామి వివేకానంద 161 వ జయంతి పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సభ్యులు మరియు ఏబీవీపీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం. దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్. థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో చోటు చేసుకున్న ఘటన. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు. గొడవ జరగకుండా చూసేందుకు, థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.




Total views : 90871