కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
cvr telugu
అమరావతి, నేడు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల. 9:30 నీ లకు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు రానున్న షర్మిల. షర్మిల ప్రమాణ స్వీకారానికి రానున్న ఏఐసిసి నేతలు మాణిక్యం టాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఎపిసిసి కీలక నేతలు,మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్న వైఎస్ షర్మిల. కానురులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పిసిసి కార్యాలయానికి రానున్న షర్మిల. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్న షర్మిల.
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
దళితుడిని చంపిన వాడికి అందలం…. చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా?
జగన్మోహన్ రెడ్డి తన స్వార్దం కోసం కోడి కత్తి శ్రీనివాసరావు ను బలిపశువును చేసారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దళిత వర్గాలకు మేలు పేరుతో దగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకు శ్రీను బలయ్యాడన్నారు. చిన్న ఆయుధంతో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని సానుభూతి నాటకాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించారన్నారు. చెయ్యని తప్పుకు విడుదలకు అవకాశం లేకుండా జైల్లో ఉంచే కుట్ర జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఆరాధ్యుడన్నారు. మహనీయుని రాజ్యాంగ అమలు వలనే అందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎటువంటి అర్హత లేదన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్ పై విడుదల చేసి తన కార్యక్రమంలో ఉంచిన వ్యక్తి జగన్మోహన రెడ్డి అని అన్నారు. దళితుడిని చంపిన వాడికి అందలం చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా? ఇంతలా దళితులను మోసం చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభమా? దళిత డాక్టర్ నూ అన్యాయంగా చనిపోయాలే చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు మరచిపోరని మండిపడ్డారు.
నంద్యాల జిల్లా నంద్యాలలో జేసీ బంగ్లాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అందులో ఇది ఒకటిని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్ ని కేవలం కోటి రూపాయలతోనే సుందరవణంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ మంజీర జిలానీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21న రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడి నుంచి బూత్ కమిటీ సభ్యులను, పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో, నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని పలు కూడళ్లలో తిరిగి చివరగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 రోజులు నుంచి విరామం లేకుండా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి తమకు ఫోకస్ నోటీసులు జారీ చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు చర్చలకు పిలిచి తమకు ఎటువంటి న్యాయం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కి వినిపించడం లేదా అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి సమ్మె జగన్మోహన్ రెడ్డి కి కనిపించడం లేదా అని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతాం అని అంగన్వాడి వర్కర్స్ వాపోతున్నారు.