Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh దళితుడిని చంపిన వాడికి అందలం…. చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా?

దళితుడిని చంపిన వాడికి అందలం…. చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా?

by Prakash
Gauthu Sirisha is the state general secretary of TDP

జగన్మోహన్ రెడ్డి తన స్వార్దం కోసం కోడి కత్తి శ్రీనివాసరావు ను బలిపశువును చేసారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దళిత వర్గాలకు మేలు పేరుతో దగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకు శ్రీను బలయ్యాడన్నారు. చిన్న ఆయుధంతో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని సానుభూతి నాటకాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించారన్నారు. చెయ్యని తప్పుకు విడుదలకు అవకాశం లేకుండా జైల్లో ఉంచే కుట్ర జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఆరాధ్యుడన్నారు. మహనీయుని రాజ్యాంగ అమలు వలనే అందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎటువంటి అర్హత లేదన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్ పై విడుదల చేసి తన కార్యక్రమంలో ఉంచిన వ్యక్తి జగన్మోహన రెడ్డి అని అన్నారు. దళితుడిని చంపిన వాడికి అందలం చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా? ఇంతలా దళితులను మోసం చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభమా? దళిత డాక్టర్ నూ అన్యాయంగా చనిపోయాలే చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు మరచిపోరని మండిపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: