పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్ పడవలు ఇప్పుడు పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ లో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు రైతులు వరి కోసి వరి పనలను పడవల ద్వారా వడ్డీకి చేరుస్తున్నారని పంట పొలాల నుండి నీరు బయటకు వెళ్లకపోవడానికి వైసీపీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యమని కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలు ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
cyclone
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.68 మీటర్ల చేరుకున్న నీటిమట్టం. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం.15372 క్యూసెక్కుల చేరుతున్న నీరు.ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టి.ఎం.సి.లు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 1400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నరసాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ భారీ వర్షానికి డ్రైన్లు పొంగి రోడ్లు పైకి వచ్చి రోడ్లు అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారుల పైకి డ్రైన్ వాటర్ పొంగిపొర్లడంతో రహదారులపై వర్షపు నీరుతో పాటు ట్రైన్లు మురుగు చేరడంతో రహదారులపై ఇటు అటు వాహనాలు పై ప్రయాణించే ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికైనా డ్రైన్ సరిచేయాలని దుర్వాసన రాకుండా తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు. ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని కథలు చెప్పాడు. ప్రజలు తమ భాదను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారికి తెలియజేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా తుఫాను బాధితులకు ఇవ్వలేదు.
ఇదేనా ప్రభుత్వం నిబద్దత అని ఎద్దేవా చేసారు.
ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అక్కడక్కడ నేలకొరిగిన వరి పంటలు. కొన్ని చోట్ల తుఫాను హెచ్చరికతో వరి కోతలు నిలిపివేశారువరి పంట బాగా పండింది అనుకున్న టైంలోప్రకృతి వైపరీత్యం వల్ల అన్నదాతఆవేదన గురవుతున్నాడు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్. ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుఫాన్. మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు. కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్. తుఫాన్ కారణంగా హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు,తిరుపతి,విశాఖపట్నం, షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు. విజయవాడకు మీదుగా వెళ్లే 145 రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. మూడు రోజులపాటు రైళ్ళను రద్దు చేసిన అధికారులు..
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. ఈ రోడ్లో ఎవరు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉప్పాడ సముద్ర తీరం నుంచి మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని మరిన్ని వివరాలు అందిస్తారు.
ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 0866- 2575833లో సంప్రదించాలని తెలిపారు.




Total views : 79187