గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెదనందిపాడు లో గత రాత్రి తెలుగుదేశం,వైసిపి వర్గీల మధ్య ఘర్షణ. పాత బస్టాండ్ సెంటర్ లోని రామాలయం దగ్గర ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ వారు వైసిపి ఫ్లెక్సీలు తొలగించడంతో ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఫ్లెక్సీలు తీసేసి టిడిపి ఫ్లెక్సీలు అంతే ఉంచారని ఆరోపిస్తున్న వైసిపి వర్గీలు. ఈ ఘర్షణలో ఆలయ కమిటీ వారికి వత్తాసుగా తెలుగుదేశం నాయకులు పలకటంతో వైసీపీ వర్గీలకు తెలుగుదేశం వర్గీలకు ఘర్షణ. తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువురు ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు ..
guntur
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి, మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు దిగిన తెలుగు తమ్ముళ్లు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదల కొట్టడంతో సమసిపోయిన వివాదం.
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. మిరప దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే పలనాడు జిల్లా దాచేపల్లి మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న తుఫాను కారణంగా చేతికి అంది వచ్చిన మిర్చి నీట మునిగిపోయాయి. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పంట పొలాల దగ్గరికి వచ్చి రైతుల పరిస్థితి ఏంటి అని చూసిన పాపాన పోలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల గట్ల వెంబడి తిరుగుతూ నీట మునిగిన పొలాలను చూసిన రైతుల గుండె తరుక్కుపోతోంది. మిచౌంగ్ తుపాను అన్న దాతను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక సాగుదారులు మౌనవేదనతో తల్లడిల్లిపోతున్నారు. గతేడాది మాండౌస్.. ఈసారి మిచౌంగ్ తుఫాన్ రూపంలో రైతులను నిండా ముంచాయి. మొత్తం మీద తుపాను మిర్చి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తుంటే, తుఫాను దాటికి రైతులు పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్, టెలికామ్ సేవలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. గూడూరు, చవటిపాలెం, పురిటిపాలెం, విందురు, చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది. నీళ్లు,ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also..
Read Also..
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది. ముఖ్యంగా వరి, మిర్చి, శనగ, పొగాకు వంట వేసిన రైతులకు భారీ ఎత్తున నష్టాలు జరిగాయి. వరిపైలు కోతకొచ్చిన దశలో ఈ విధంగా తుపాను ప్రభావం చూపడంతో కాకుమాను వట్టిచెరుకూరు మండలాల్లో. వరి వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
టీడీపీ, జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుంది – టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు.
ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాకినేని పెద్ద రత్తయ్య ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయులు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ హాజరవ్వగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సంఘాల నాయకులు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం తనకి ఎప్పటినుంచో సుపరిచితమని ప్రతిపాడు లో అఖండ మెజార్టీతో టిడిపిని గెలిపించుకుంటానని ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు తెలిపారు.. టిడిపి జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుందని అన్నారు..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు. నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని హుకుం జారీ చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు.
Read Also..
Read Also..
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.