గుంటూరు, యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది. వ్యవస్థలన్ని నాశనం చేసి, అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు. సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం, దనదాహం ఉంది. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి. తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ, జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. SC, ST, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక. పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక. వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ. రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది. గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు. టీడీపీ, జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి.
guntur
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు. నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి.శ్రీఖర్, గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6:00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు.
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
2023 కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ గ్రూప్ ఆఫ్ సివిఆర్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గురజాల ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ రైతు,రైతు కూలి అందరు ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడు ని కోరుతున్నాను అని అన్నారు. అదే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ని గురజాల ప్రాంతంలో మరియు రాష్ట్రంలో మళ్ళీ గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చెయ్యాలని వారు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు కోట కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ మునగా పున్నారావు తో పాటు గురజాల దాచేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన. బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న యశస్విని. తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ కి విచ్చేసిన యశస్విని. గత కొంత కాలంగా ప్రభుత్వం పై అనుచిత పోస్టులు పెడుతున్నారని సీఐడీ అరెస్ట్. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగా అరెస్ట్ అంటున్న టిడిపి నేతలు. అక్రమ అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టిడిపి నేతల డిమాండ్.
గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజక వర్గ వైసీపీ నాయకులు సమావేశం, నాయకులు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ కి కార్యకర్తలే బలం. కార్యకర్తలే లేకుంటే పార్టీలే ఉండవు. నాయకుల మధ్య విభేదాల ఉంటే వాటిని పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలి. గతంలో ఇక్కడ సుచరిత గారిని గెలిపించిన విధంగా ఇంచార్జి కిరణ్ గెలిపించాలని కోరుతున్నా. పార్టీ కోసం గ్రామ గ్రామాన ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు గురించి చెప్పాలి. ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో కార్యకర్తలకు గుర్తింపు తెచ్చిన ఘనత వైసీపీ దే అని వెల్లడించారు.