తమిళనాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని జల్లికట్టు లో ఒక బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని సిరవాయల్లో జల్లికట్టు పోటీ జరుగుతోంది. ఈ పోటీలను సహకార శాఖ మంత్రి కెఆర్ పెరియ కరుప్పన్ ప్రారంభించారు. ఈ పోటీలో ఆన్లైన్లో నమోదైన 271 ఎద్దులను గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి విప్పుతున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు, ఆవుల యజమానులకు బహుమతులు అందజేయనున్నారు. అంతకుముందు మంజువిరాటు ఉత్సవ సమన్వయకర్త వేలుచ్చామి ఆధ్వర్యంలో పెరియనాయకి, తేనాక్షి అమ్మన్ ఆలయంలో శమీ దర్శనం ముగించుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. అక్కడి నుంచి ఎద్దులను ఒకదానికొకటి విడిచిపెట్టి. 800 మంది వరకు పోలీసుల రక్షణలో పాల్గొంటున్నారు. పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ పోటీలను ప్రారంభించారు. బృంగటికి చెందిన భాస్కరన్ (13) అనే బాలుడు ఎద్దును పట్టుకోవడానికి వెళ్లి ఢీకొని మృతి చెందాడు. అలాగే 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
health news
గుంటూరు, యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది. వ్యవస్థలన్ని నాశనం చేసి, అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు. సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం, దనదాహం ఉంది. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి. తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ, జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. SC, ST, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక. పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక. వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ. రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది. గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు. టీడీపీ, జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి.
విజయవాడ, పార్టీ మారుతున్నారనే ప్రచారం పై వంగవీటి రాధా స్పందించారు. నేను టీడీపీలోనే ఉంటా, గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దు. కొద్దిరోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం. తాజాగా ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టిన వంగవీటి రాధా. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన వంగవీటి రాధా. మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానన్న వంగవీటి రాధా.
దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు AIపై శిక్షణ ఇచ్చేందుకు భారీ మొత్తంలో వెచ్చించడానికి సైతం వెనకాడటం లేదు. ఈ రంగంలో లక్ష మంది ఉద్యోగులకు శిక్షణను పూర్తి చేశామని వెల్లడించింది. నిన్న రిలీజ్ అయిన TCS Q2 ఫలితాల కాన్ఫరెన్స్ లో కంపెనీ CEO & MD కృతివాసన్ ఈ మేరకు ప్రకటించారు.
‘జనరేటివ్ AI అందరి దృష్టినీ ఆకర్షించింది. మా కస్టమర్ సమ్మిట్లలో ప్రతి ఒక్కరూ ఉత్పాదక AIని కీలక థీమ్గా మాట్లాడుతున్నారు. కొత్త ఉత్పత్తులు, సేవల కోసం దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో.. ప్రాజెక్ట్లను ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి’ అని TCS CEO తెలిపారు.
ఉద్యోగులు సహా కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ‘మేము ఇప్పుడు లక్ష మంది బలమైన Gen-AI రెడీ కన్సల్టెంట్స్ మరియు ప్రాంప్ట్-ఇంజనీర్లను కలిగి ఉన్నాము. వారు ఆయా సెగ్మెంట్లలోని మా క్లయింట్ల కోసం వందలాది Gen-AI ప్రాజెక్ట్లను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
విశాఖ, దక్షిణ నియోజకవర్గం వైసీపీ లో కుమ్ములాట. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మాకు వద్దంటూ కార్పొరేటర్లు ఆగ్రహం. 400 మద్యం బాటిళ్లు పంచి వైసీపీ పరువు తీసారంటున్న కార్పోరేటర్లు. MLA వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కళాశాలలో మద్యం పంపకాలు పై వాసుపల్లి పై తిరగబడ్డ ycp కార్పొరేటర్లు. అవసరమైతే వైసీపీకి రాజీనామా చేస్తామంటున్న కార్పొరేటర్లు. మందు పుల్ బాటిల్స్, కేజీ కోడి మాంసం పంపిణీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు. మేడారం జాతర నిర్వహణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి వద్ద నాయకపోడ్ గిరిజన పూజారులు మంత్రి సీతక్క, కొండా సురేఖ లకు ఘన స్వాగతం పలికారు. ఘట్టమ్మ తల్లికి మంత్రులు చీరే, సారె లను సమర్పంచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క, సురేఖ లను ఆశీర్వదించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం పరిసరాలను మంత్రి సీతక్క పరీశీలించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో దారుణం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా గ్రామంలోని యూత్ ఆధ్వర్యంలో మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. కాగా ఈ కోలాటం పోటీలలో మహిళలు కోలాట నృత్యం చేశారు. కాగా కోలాటం మధ్యలో అంతడుపుల రాజమణి (40) హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు, గ్రామ పెద్దలు జమ్మికుంట లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని తెలిపారని గ్రామ సర్పంచ్ దాసరి భద్రయ్య తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తో కల్వల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.





Total views : 92844