క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.
health news
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
వరంగల్, ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన. మొదట గట్టమ్మ వద్ద మొక్కులు. గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి, జాతర ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం. అధికారులకు దిశ నిర్దేశం చేయనున్న మంత్రులు.
చాలామందిని పట్టిపీడిస్తున్న వ్యాధులలో మధుమేహం ఒకటి. ఇది శరీరంలో అనియంత్రిత చక్కెర స్థాయి కారణంగా సంభవిస్తుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 250 కంటే ఎక్కువ ఉంటే, వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదని చెబుతారు. బొప్పాయి తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అది ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర స్థాయిని నియంత్రించడానికి, డయాబెటిక్ రోగులు బొప్పాయితో సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల ఉదర సమస్యలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మీకు కావాలంటే, మీరు బొప్పాయి మరియు నారింజ వంటి సిట్రస్ పండ్ల స్మూతీని తయారు చేసి తినవచ్చు. బొప్పాయిని సరైన మోతాదులో తింటే. అది వారి చక్కెర స్థాయిపై చెడు ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండిన బొప్పాయిని సరైన పరిమాణంలో రోజూ తినవచ్చు. సలాడ్ రూపంలో కూడా దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బొప్పాయిని అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం మధ్య లేదా లంచ్ మరియు డిన్నర్ మధ్య తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్వామి వివేకానంద 161 వ జయంతి పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సభ్యులు మరియు ఏబీవీపీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం. దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్. థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో చోటు చేసుకున్న ఘటన. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు. గొడవ జరగకుండా చూసేందుకు, థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ భుతులను ఓపెన్ చేశారు ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు ఫాస్టాగ్ రాకముందు సొంతుర్లకు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బంది పడేవారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కొత్త పింఛను మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది హెచ్ఐవీ బాధితులు రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. వీరిలో కొందరు పింఛను రాకుండానే కన్నుమూస్తున్నారు. మరోవైపు పింఛను అందుకునేవారిలో కొందరు అనర్హుల జాబితాలో చేరుతున్నారు. ఈ పరిణామాలు హెచ్ఐవీ బాధిత కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు, వాచ్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిలోనే హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. పనిచేయాలన్నా ఇలాంటి వారికి శరీరం సహకరించదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా తోడ్పాటును అందించే పింఛను కూడా రాకపోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 60శాతం మహిళలే ఉన్నారు. వన్ పెన్షన్ విధానంలో కొంతమందిని విద్యుత్తు వాడకం, సొంతిల్లు, ఇతర నిబంధనల అమలుతో లబ్ధిదారులు తగ్గిపోతున్నారు. బాధితుల్లో వితంతువులు ఉన్నట్లయితే వీరికి ఆ పింఛన్తోపాటు ఇదికూడా వచ్చేది. ఆధార్ సాయంతో రెండుచోట్ల ప్రయోజనం పొందుతున్నారన్న ఉద్దేశంతో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. సుమారు 35వేల మందికి పింఛను అందుతోంది.
నంద్యాల జిల్లా, నేటి నుండి ఈ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్ర,చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల.




Total views : 92820