కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, మొవ్వ (మ) కూచిపూడి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాల, బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈ నెల 11 నుంచి 13 వరకు కబడ్డీ పోటీలు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొనున్నాయి. లక్ష రూపాయలు వరకు నగదు బహుమతి ఉంటుంది అని కన్వీనర్ గొట్టిపాటి సాయి అన్నారు. గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు చే బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అని అన్నారు.
health news
నల్ల మిరియాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తక్కువ కర్కుమిన్ తీసుకునేవారితో పోలిస్తే అధిక మోతాదులో కర్కుమిన్ తీసుకునే ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నిరూపించబడింది. టమోటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. లైకోపీన్ అనేది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. ఇది ఊపిరితిత్తుల సామర్థాన్ని పెంచడంతో పాటుగా ఉబ్బసం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆలివ్ శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం తగ్గుతుంది. బ్లూబెర్రీస్ ల్లో పోషకాలు పుష్కలంగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఆంథోసైనిన్లు అనేవి పిగ్మెంట్లు. ఇవి ఊపిరితిత్తుల్లోని కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయని తేలింది. గ్రీన్ టీ లాగే కాఫీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కెఫిన్ ఆస్తమా లక్షణాలను, ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, సెలీనియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ మన ఊపిరితిత్తుల కార్యకలాపాలను పెంచుతుంది. ఇది సిఓపిడి ప్రమాదాన్ని కూడా తప్పిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా గ్రీన్ టీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
Read Also..
Read Also..
మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి దగ్గరగా ఉంచుకోకూడదు. దీనివల్ల ఫోన్ నుంచి బ్యాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే ఫోన్ ఎప్పుడూ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడుస్తుండాలి. 70 శాతం ఆల్కహాల్ ఉండే వైప్స్ తో ఫోన్ ను తుడవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చాలా మంది బాత్ రూమ్స్ లోకి కూడా తీసుకువెళ్లి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల బ్యాక్టీరియా మరింత ఎక్కువగా చేరుతుంది. బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లకుండా ఉంటేనే ఉత్తమమని సూచిస్తున్నారు. తల, భుజాన్ని గంటల తరబడి వంచి మొబైల్ ను చూడటంవల్ల టెక్స్ట్ నెక్ అనే సమస్య బారిన పడతారు. వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పితో బాధ పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది. నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం. నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి. 26మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా. బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.





Total views : 92792