రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. హైదరాబాద్ రావడం బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లడం తప్ప రాహుల్ చేస్తున్నదేమీ లేదన్నారు. ప్రతిసారి ఇలాగే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లిపోవాలని ఆమె సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిన విషయాన్ని ఆమె బోధన్ ప్రచార ర్యాలీలో గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రతిసారీ తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు. వందలాది మంది యువత బలి దానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ శాంతి భద్రతల సమస్య ఉండేదన్నారు కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని కవిత విమర్శించారు.
Tag:
hydderabad news
హైదరాబాద్ శివారులో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును పట్టుకున్నామని తెలిపారు. లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- మలక్ పేట్ – అంబర్ పేట్ నియోజకవర్గాలకు యతీంద్ర ప్రసాద్ ఐ.ఏ.ఎస్ (8125971984)
- చార్మినార్ – చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలకు సమీర్ వర్మ ఐ.ఏ.ఎస్ (8125972478)
- ఖైరతాబాద్ – జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జె.జయకాంతన్ ఐ.ఏ.ఎస్ (8125967488)
- సనత్ నగర్ – నాంపల్లి నియోజకవర్గాలకు డా. అహ్మద్ ఇక్బాల్ ఐ.ఏ.ఎస్ (8125972156)
- కార్వాన్ – గోషామహల్ నియోజకవర్గాలకు కవిత రాము ఐ.ఏ.ఎస్ (8125971991)
- యాకత్ పుర – బహదూర్ పుర నియోజకవర్గాలకు దీపాంకర్ సిన్హా ఐ.ఏ.ఎస్ (8125972009)
- సికింద్రాబాద్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు గాయత్రి క్రిష్ణన్.బి ఐ.ఏ.ఎస్ (8125972486)
- ముషీరాబాద్ నియోజకవర్గానికి సచీంద్ర ప్రతాప్ సింగ్ ఐ.ఏ.ఎస్ (8125972490)




Total views : 79000