హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో ఆరు కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్సిటీకి కూడా మెట్రోను తీసుకెళ్లనున్నారు.
ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీవరకు 40 కిలోమీటర్ల కారిడార్గా 8 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నాగోల్-ఎయిర్పోర్టు అలైన్మెంట్కు సంబంధించి డీపీఆర్లో స్వల్పమార్పులు చేశారు. మొదట ప్రతిపాదించిన నాగోలు, ఎల్బీనగర్ వయా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు- మైలార్దేవ్పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్ ఎయిర్పోర్టు 29 కిలోమీటర్లకు బదులుగా నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆరాంఘర్, న్యూహైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎయిర్పోర్టుకు కారిడార్ను నిర్మించేందుకు డీపీఆర్ను రూపొందించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇటీవల పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీపీఆర్ అంశాలను తెలియజేశారు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90587