ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో చీకటి జీవోలను ఈ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజు తెనాలిలో ఎర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లే కార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ భోగి మంటలతో వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు. ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం టిడిపి అధికారంలోకి వస్తుందని మరింత ఆనందంగా పండుగ జరుపుకుందాం అని తెలిపారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అమయకులపై దాడులు చంద్రబాబు గారి కుటుంబాన్ని వేధించిందని అవన్నీ ఈ భోగిమంటల్లో పోవాలని టిడిపి అధికారంలోకి రావాలని కోరుతున్నామని అన్నారు.
jagan
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 34 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో అంగన్వాడీలు భోగి మంటలు వేసి మంటల చుట్టు తిరుగుతూ జగన్ కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె అణిచివేత కొరకు విడుదల చేసిన ఎస్మా జిఓ కాపీలు, షోకాజ్ నోటీసుల కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 34 రోజుల నుండి ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ సమ్మెతో చివరకు అన్ని పండుగలు రోడ్డు మీద చేసుకునే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంకల్పం లో భాగంగా నేటి ఉదయం గొల్లపూడి లో పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతో టీడీపీ భోగి సంకల్పం నిర్వహించారు. తొలుత గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి భోగి మంటలు వేసిన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను, జగన్ ప్రభుత్వ అక్రమ జీవోలను దేవినేని ఉమ, జనసేన తెదేపా శ్రేణులు, మరియు గ్రామస్తులు భోగిమంటల్లో తగలబెట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో గొల్లపూడిని హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నిలబెట్టారు అన్నారు. 55 నెలల్లో ప్రజా పరిపాలన విధ్వంసం అయ్యిందని చంద్రబాబు నాయుడు జాతి సంపద సృష్టించేవాడని వివరించారు. ఐటీ రంగ విప్లవంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అబద్దపు హామీలతో నమ్మించి, వంచించిన జగన్ పై, వైసీపీపై ప్రజలు కోపంతో రగిలి పోతున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన నేతల గెలుపు ఖాయమని అన్నారు. అందరూ పండుగలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలోని యాదవ్ బజార్ లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ – జగనన్న వాక్ వే ను నిర్మించారు. పాత బస్టాండ్ సమీపంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో ఆధునికరించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. నేను వైసిపి పెనమలూరు అభ్యర్థిని నా మీద ఎవరు పోటీ చేసినా నేను సిద్ధమేనని, పెడన నియోజకవర్గ ఉప్పాల రాముకు నేను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కేశినేని నాని మా పార్టీలోకి వస్తాను అనడంతో అతన్ని పార్టీలోకి ఆహ్వానించామని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించామని ఆయన అక్కడ గెలవబోతున్నారని అన్నారు. నా నియోజకవర్గం మైలవరం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు పెడనలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2019లో మరల పెడన నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు మళ్ళి అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు పెనమలూరులో పోటీ చేయమంటున్నారు అలానే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తాను. జగన్ ఎలా చెప్తే అలా నేను పని చేస్తానని, ఆయన మాటను నేను శిరసా వహిస్తానని ఆయన అన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుకొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రొద్దం మండలంలోని పల్లె పల్లెన ఉషమ్మకు మహిళలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఉషాశ్రీచరణ్ ఉత్సాహంగా స్ధానిక మహిళలతో కలిసి నృత్యం చేశారు. పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మంత్రి ఉషశ్రీచరణ్ తిరుగుతున్నారు. అందులో భాగంగా రొద్దం మండలంలో పర్యటించారు. 2024లో సీఎం జగన్ ని సీఎం చేసేంతవరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని, ముఖ్యంగా మహిళలకు జగనన్న చేదోడువాదోడుగా ఉంటాడని, కాబట్టి మహిళలందరూ వైసిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మహిళలతో డ్యాన్స్ ఆడుతూ మంత్రి మహిళలతో కలిసి తిరిగారు.
గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. సుమారు 1500 కోట్లతో దాచేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్న కాసు, ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో లెక్కలతో వస్తామని చెప్పారు. ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వంలో 3330 ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే జగన్ ను తనను తిరిగి ఆశీర్వదించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరారు.
Read Also..
ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు వస్తున్నవారు ఒకప్పుడు జగన్ నువిమర్శించారని, కాబట్టి నమ్మకస్తులకు టికెట్లు ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్దాయనకు బీఫారాలు ఇస్తే ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సార్పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు. లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అమలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడ అంతా కంపు కొడుతా ఉందని అన్నారు. ఈ రోజు ఈ చిరు ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు ఇంత కూరాత్మకంగా వ్యవహరిస్తున్నావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యో్గులు ఉద్యోగాలకి వెళ్లకపోవడం వల్ల గర్భిణీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలకు వెళ్ళాక పోవడం వలన సుమారు రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డు ల పడి ఉన్నాడని అన్నారు. ఈ చలికాలం లో చెత్త పేరుకు పోవటం వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ లో ప్రజలు జాయిన్ అవుతుంటుంటే ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. అన్ని నిత్యా అవసర సరుకుల ధరలు పెంచావు ఈ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో నరకం అనుభవించారని అన్నారు. ఈ ప్రభుత్వం తో ప్రజలు విసిగి పోయారు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసారు. ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడం కోసమే జనాలకు అమలు కానీ హామీలు ఇచ్చావని ఆయన అన్నారు.






Total views : 91042