కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
jagan
2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మెట్ట ప్రాంత రైతులను నిలువునా దగా చేశారని పశ్చిమ ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ హామీలలో స్థిరమైన మద్దతు ధర కల్పించలేకపోవడం, ఫ్యాక్టరీలలో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, తక్కువ ధరకు ఎరువులు ఇస్తానని, సబ్సిడీ మీద డ్రిప్పులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆయిల్ ఫామ్ కు టన్నుకు 18000 గిట్టుబాటు ధర కల్పించాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా.. సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సంస్కృతి మీ పరిపాలనలో జరగటం లేదా.. గొంతు ఎంతిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది.. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుటిల రాజకీయాలతో బానిసలుగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజుల్లో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పైకి చెప్తు లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
దళితుడిని చంపిన వాడికి అందలం…. చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా?
జగన్మోహన్ రెడ్డి తన స్వార్దం కోసం కోడి కత్తి శ్రీనివాసరావు ను బలిపశువును చేసారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దళిత వర్గాలకు మేలు పేరుతో దగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకు శ్రీను బలయ్యాడన్నారు. చిన్న ఆయుధంతో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని సానుభూతి నాటకాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించారన్నారు. చెయ్యని తప్పుకు విడుదలకు అవకాశం లేకుండా జైల్లో ఉంచే కుట్ర జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఆరాధ్యుడన్నారు. మహనీయుని రాజ్యాంగ అమలు వలనే అందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎటువంటి అర్హత లేదన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్ పై విడుదల చేసి తన కార్యక్రమంలో ఉంచిన వ్యక్తి జగన్మోహన రెడ్డి అని అన్నారు. దళితుడిని చంపిన వాడికి అందలం చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా? ఇంతలా దళితులను మోసం చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభమా? దళిత డాక్టర్ నూ అన్యాయంగా చనిపోయాలే చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు మరచిపోరని మండిపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 రోజులు నుంచి విరామం లేకుండా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి తమకు ఫోకస్ నోటీసులు జారీ చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు చర్చలకు పిలిచి తమకు ఎటువంటి న్యాయం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కి వినిపించడం లేదా అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి సమ్మె జగన్మోహన్ రెడ్డి కి కనిపించడం లేదా అని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతాం అని అంగన్వాడి వర్కర్స్ వాపోతున్నారు.
స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
విజయవాడ, కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. కోర్ట్ కి రావడం లేదు. జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు. సుబ్బరాజు శ్రీను సోదరుడు. నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు. నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి. రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం. ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని ఒక్కడికి ఒక న్యాయం. జగన్ కి అనేక సార్లు విన్నవించాం. జైల్ లో శ్రీను, విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి. లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం.
అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.





Total views : 91124