పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సంక్షేమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నత కోసం అడుగడుగునా పరితపిస్తూ నవరత్న పథకాలతోటే పేదల తలరాత మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వైస్సార్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహాలంగా ఏర్పాట్లు నిర్వహించామని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఎన్నార్టీ రోడ్డు లో గల పాత పశువుల సంత ప్రక్కన గోల్కొండ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మేము ఇచ్చే ప్రేమ విందును స్వీకరించాలని కోరారు.
Jagan mohan reddy Birthday celebrations
మనసున్న మహామనిషి, మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిరకాలం వర్ధిల్లాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆకాంక్షించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. సారవకొట మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కొలమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా, రాష్ట్రాభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని 51వ ఏట అడుగుపెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వరాలతో చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.