జమ్ము-కశ్మీర్ లో నేడు మలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జమ్ముతో కలిపి మొత్తం 7 జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 415 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా వీరిలో మాజీ డిప్యూటీ సీఎంలు తారా చంద్, ముజఫర్ బేగ్ లు ఉన్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కశ్మీర్ లోయలోని బారాముల్లా, ఉరి, రఫియాబాద్, పఠాన్, గుల్ మార్గ్, సోపోర్, కుప్వారా, కర్ణా, త్రెహ్గం, హంద్వారా, లోలాబ్, లాంగేట్, బందిపొరా, సోనావరి, గురేజ్, వగూరా క్రీరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ భద్రత నడుమ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జమ్ములో 24 ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో వెస్ట్ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్భా తెగలకు చెందినవారు ఓటు వేయనున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో 20 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు ప్రశాంతంగా కశ్మీర్ తుది విడత ఎన్నికల పోలింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.
జమ్ము-కశ్మీర్ లో మలివిడత ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ X వేదికగా ట్వీట్ చేశారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరారు. అలాగే తొలిసారి ఓటు వేసే యువతతో పాటు మహిళలు కూడా పెద్దఎత్తున ఓటు వేసేందుకు తరలి వెళ్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది. ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల, ఆమె కూతురు…
- జూబ్లీహిల్స్ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్రంజన్రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ…
- ఆఫ్రికాలో ఎబోలా కలకలం..ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కాంగోలో 88మంది మృతి చెందగా…మరో 300మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ…
- ఇరాన్ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…
- తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం..తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79946