మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహరాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. జార్ఖండ్లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 186 పోలింగ్ బూత్లు, 29వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 13న నోటిఫికేషన్, 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని రాజీవ్ కుమార్ తెలిపారు. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఉగ్రవాదులకు, ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదులు స్వీకరించడానికి సీ-విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పవన్కల్యాణ్ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212396