బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని, స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విమర్శించారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేదా? పేదలకు ఉచితంగా కాంగ్రెస్ బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు. తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.
Kcr
బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితమైన ఉద్యోగ ప్రకటనను ఇస్తామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండో ఒకటే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనన్నారు. బీసీని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
డిసెంబర్ 3 తర్వాత సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారన్నారు మంత్రి కేటీఆర్. అదే సౌభాగ్య లక్ష్మీ అని తెలిపారు. ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలందరికీ 3వేల రూపాయలను ఇవ్వనున్నారన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధంగా తెలిపారు. అలాగే ఆసారా ఫించన్లను 2వేల రూపాయల నుండి దశల వారీగా 5వేలకు పెంచుతాన్నామన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.
Read Also..
Read Also..
ఉప్పల్ నియోజకవర్గం లో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం లోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్ ఎక్స్ లో పనిచేస్తున్న కార్మికులు అండగా ఉంటానని ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర మరియు కంపెనీ దగ్గర కూడా కలిసి మద్దతు కోరామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్ఎఫ్సి వర్కర్స్ యూనియన్ ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు తెల్పుతున్నట్లు యూనియన్ మాజీ అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పూర్తి మద్దతు బండారి కుటుంబానికి ఉంటుందని,ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.
బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది’ అన్నారు. నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట.. ‘నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్ టైమ్ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగుతాయ్. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
సనత్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మైనార్టీ సోదరులు ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ అవసరం వచ్చిన శుభకార్యానికి అండగా నిలిచే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని 450 కోట్లతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలిపారని వారు అన్నారు. మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని కుల, మతవరణలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే తెల్ల బట్టలు వేసుకొని కనబడే వ్యక్తులు ప్రజలలో ఎప్పటికీ ఉండాలని స్థానిక ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు లేకనే ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై కేసీఆర్ పై నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరిలో ప్రవహించే రక్తం పోరాటాల స్ఫూర్తితో ఉంటుందని వారు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయే ప్రజలు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని ఎన్ని ప్రలోభాలుకు గురిచేసిన భయపెట్టిన భయపడే వాళ్ళు ఎవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు కాని వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, ఇక్కడి మనిషైనా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి పార్టీ అభ్యర్థి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేడని వారితో నాకు పోటీ ఏంటి అని ఎద్దేవా చేశారు. కచ్చితంగా సనత్ నగర్ నియోజకవర్గం లో లక్ష మెజార్టీతో తన గెలుపు ఖాయమని అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి. నాడు మౌనంగా ఉన్న వారు కూడా ఎన్నికల వేళ నిలదీసే పరిస్థితులు వచ్చేశాయి. చిన్నయ్యపై భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సొంత గ్రామం జెండా వెంకటాపూర్ ను అయినా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక బెల్లంపల్లి పట్టణంలో సొంత పార్టీ నాయకులు పార్టీని వీడారు. ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కారు దిగిపోయారు. మరికొందరు అదే బాటన సాగుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. హాట్రిక్ విజయం ఎమ్మెల్యే చిన్నయ్య విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓటర్ల కరుణ కోసం ఆరాటపడుతున్నారను.
ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1లక్ష 60వేల 83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ పిల్లలకు చెప్పండని.. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజెంటేషన్ ఇచ్చి… ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండన్నారు. గుజరాత్లో 6 కోట్లు, రాజస్థాన్లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో తాము 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. ఇవి వాస్తవాలని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశామని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలు కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా.. అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. వికరాబాద్ సభలో కేసీఆర్ భట్టి పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత వీఆర్వో వ్యవస్థను తీసుకువస్తామని భట్టి చెబుతున్నారన్నారు. వీఆర్వో వ్యవస్థ వచ్చిందంటే తెలంగాణ భూములన్నీ మాయం అవుతాయని అన్నారు. అవినీతికి ఊతం ఇచ్చేందుకు భట్టి మళ్లీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీఆర్వో లు అంటేనే లంచాలమయం అని అన్నారు. ధరణి తీసేస్తే భూముల రిజిస్ర్టేషన్ లో పారదర్శకత లోపిస్తుందన్నారు.
Read Also..
Read Also..
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో BRS ఎమ్మెల్యే అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఈ ర్యాలీ ఎన్నికల ర్యాలీలా లేదు విజయోత్సవ ర్యాలీలా ఉంది . రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన పని 2టర్మ్ లు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కూడా చేయలేదు.. ఉప ఎన్నికల్లో సీఎం హుజూర్ నగర్ కు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు… తండాలు గ్రామపంచాయితీలు గా చేసిన ఘనత కెసిఆర్ దే..సెవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించింది మా ప్రభుత్వమే, కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఆన్నవాళ్లు..ఈరోజు ఎంతమంది పోటీ చేస్తున్నారు…అక్కడ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేదు…మిగతా గ్యారెంటీలకు గ్యారెంటీయే లేదు. స్కాములు చేయాలే.. రాష్ట్రాన్ని మింగేయలి ఇదే కాంగ్రెస్ నినాదం.. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబందు దుబారా అని చెబుతున్నాడు.. భట్టి విక్రమార్క ధరణి రద్దు చేస్తా అంటాడు..ఇలాంటి వాళ్ళకా మనం ఓట్లు వేసేది.






Total views : 90594