గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 2019 ఎన్నికలలో పురందేశ్వరి పెర్ఫార్మెన్స్ పై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.
latest news
ఒక్కోసారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంది.. ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులు తీస్తుంది. తాజాగా గుంటూరులో ఒక యువకుడి విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీలో సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ గుంటూరుకు వచ్చి చిన్న ప్రమాదం జరిగింది, చిన్న గాయమే అని లైట్ తీసుకున్నాడో ఏమో కానీ… బ్రెయిన్ డెడ్ అయ్యి అనారోగ్యం పాలైన యువకుడి. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వయసులో ఆ తల్లితండ్రుల బాధ వర్ణాణాతీతం!
తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను తిరుమల శ్రీవారి ఆలయం పై పడిందని ఈ నేపథ్యంలోనే తిరుపతి అభివృద్ధిలో భాగంగా ఒక్క శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు కానీ బిజెపి తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో ప్రభుత్వం దానిని తిరస్కరించడంతో మరలా మొన్న జరిగిన పాలకమండలి సమావేశంలో కొత్తగా మరో ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఇందులో తిరుపతిలో దాదాపు 39 డివిజన్లో సానిటరీ వర్క్ చేయడానికి నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపించారు.అలాగే తిరుపతిలో రోడ్ల అభివృద్ధి కంటూ 100 కోట్లకు పైగా నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆరోపించారు. చట్టంలో ఎక్కడా లేనివిధంగా శ్రీవారి నిధులను ఇలా సానిటరీ వర్కులకు రోడ్ల అభివృద్ధి కంటూ దారి మళ్ళిస్తున్నారని రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి శాసనసభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.తిరుపతి అభివృద్ధికి బిజేపి వ్యతిరేకం కాదని,టీటీడీ నిధులు ఇలా పక్కదారి పట్టడానికి వ్యతిరేకిస్తున్నామని దీనిపై టీటీడీలో జరుగుతున్న అవక తవకలను కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అక్కడ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.దేశంలో ఎక్కడ ఏ దేవాలయం నిదుల తో అభివృద్ధి జరగడం లేదని,
ముఖ్యమంత్రి జగన్ ఇతర ఆర్గనైజేషన్ నుండి డబ్బులు తేగలరా అని ప్రశ్నించారు.తిరుపతి కి క్లీన్ సిటీ అవార్డ్లు వచ్చాయని ఇప్పుడు కొత్తగా టీటీడీ నిధులతో తిరుపతి రోడ్లను పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ నిధులతోనే అవన్నీ సజావుగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకే అధిక ప్రాధాన్యత కేటాయిస్తున్నామంటూ ప్రగల్పాలు పలికిన పాలకమండలి అధికారులు తమ ఎమ్మెల్యేలకు,మంత్రులకు యదేచ్చగా ప్రోటాకాల్ టికెట్టు ఇచ్చి దర్శనాలు చేయించుకుంటున్నారని, రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారని ఆరోపించారు.ఈ బోర్డు వచ్చిన తరువాత ఎమ్మెల్యే లకు,ఇతరులకు సుపదం ద్వార దర్శనాలు ఎదేచ్చా పంపు తున్నారని అన్నారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని, గత నెల రోజులలో ప్రోటోకాల్ దర్శనం సిసి ఫుటేజ్ విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు భాను ప్రక్రష్. అధికారులు గానీ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది గానీ ఎవరైనా సరే అఖిలాండడం వద్ద వచ్చి అవకతవకలు జరగడం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ను జగన్ మోహన్ ఆలయం గా మార్చేసారని,
ఆర్టిఐ పరిధిలోకి టిటిడి ని కూడా తీసుకురావాలి అని బిజేపి డిమాండ్ చేస్తుందని అన్నారు.ధార్మిక క్షేత్రం లో సవాళ్ళు ప్రతి సవాళ్లు మంచిది కాదని అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం చిత్తూరు పలమనేరు రహదారి భూతల బండ క్రాస్ వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు, గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన మునస్వామి రెడ్డి (70ఏళ్ళు) పశువులు మేపుకుంటూ రోడ్డు దాటే క్రమంలో కర్ణాటక నుండి తిరుపతి వెళుతున్న బ్రీజా కారు ఢీకొంది, దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు.
భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు.వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా….చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించి…వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు. . అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం టికెట్తో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేసేందుకు సీపీఐ ఆలోచన చేసినా అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీనికి సీపీఐ నాయకత్వం సైతం సుముఖత తెలపడంతో సీట్ల సర్దుబాటు అంశం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఇవాళ సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి ఫైనల్ డిస్కషన్స్ చేసి పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ ఖాద్రి పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు.
తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని జోస్యం చెప్పారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్ష 20వేల మెజారిటీ వచ్చిందని, కొడంగల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. నాకోసం కాదు.. మీకోసమేనన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా?కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.




Total views : 194234